E-Paper
Advertisement

Rohit Sharma : వాళ్లిద్దరూ బాగా భయపెట్టారు: రోహిత్ శర్మ

Rohit Sharma : వాళ్లిద్దరూ బాగా భయపెట్టారు: రోహిత్ శర్మ
Advertisement
Rohit Sharma

Rohit Sharma : అప్రతిహిత విజయాలతో దూసుకుపోతున్న ఇండియా సెమీస్ గండం దాటేసింది. కివీస్ తో  జరిగిన సెమీస్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడారు. వాళ్లిద్దరూ మమ్మల్ని భయపెట్టారని అన్నాడు. వాళ్లిద్దరూ అంటే ఎవరని అనుకుంటున్నారా? వారే నండీ కివీస్ కెప్టెన్ విలియమ్సన్ , డారెల్ మిచెల్ ఇద్దరూ కూడా మా బౌలర్స్ కి కొరుకుడు పడలేదు. ఒక పట్టానా అవుట్ కాలేదు. అసాధారణ బ్యాటింగ్‌తో మా వాళ్లని ఒత్తిడిలోకి నెట్టారని చెప్పాడు.

వాంఖేడి స్టేడియంలో నేను చాలా కాలం నుంచి క్రికెట్ ఆడుతున్నాను. ఇక్కడెంత భారీ స్కోరు చేసినా రిలాక్స్ గా ఉండలేమని అన్నాడు. సింపుల్ గా కొడుతున్నారు. స్కోరు నడిపించేస్తున్నారు. ఎక్కడా రన్ రేట్ కంట్రోల్ కావడం లేదు, వికెట్లు పడటం లేదు.

Advertisement

విజయం కోసం చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. కానీ ఎవరికి లొంగని పిచ్ ఒక్క మహ్మద్ షమీకే లొంగిందని అన్నాడు.ఈ మ్యాచ్‌లో మాపై ఒత్తిడి ఉంటుందనేది తెలుసు. అందుకే ఫీల్డింగ్‌లో తప్పిదాలు చేసినా ప్రశాంతంగానే ఉన్నాం. ఆటలో ఇవన్నీ జరగడం సహజమే. అయితే ఈ మ్యాచ్‌లో ఆశించిన ఫలితాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని అన్నాడు.

టీమ్ ఇండియాలో అందరినీ పేరుపేరునా రోహిత్ అభినందించాడు. అందరికన్నా ముఖ్యంగా మహమ్మద్ షమీ గురించి చెబుతూ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఆ అద్భుతమనే పదం చాలా చిన్నదని అన్నాడు. జట్టులోని ఆటగాళ్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారని తెలిపాడు.

Advertisement

 ముఖ్యంగా టాప్-5 బ్యాటర్లు అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగుతున్నారు. ఈ టోర్నీలో అయ్యర్ రాణిస్తున్న విధానం చూడ ముచ్చటగా ఉంది. గిల్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కితాబిచ్చాడు. కోహ్లీ ఎప్పటిలానే చెలరేగి తన ల్యాండ్ మార్క్ సెంచరీతో సత్తా చాటాడని తెలిపాడు. సహచరులందరూ రికార్డులు బ్రేక్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉందని అన్నాడు.

ప్రతి మ్యాచ్ లో ఒత్తిడి ఉంటుంది. కాకపోతే సెమీఫైనల్ వంటి నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడి ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. దీని గురించి ఎక్కువగా ఆలోచించడం అనవసరం. ఇంతవరకు ఎలా ఆడి విజయం సాధిస్తూ వెళ్లామో, అలాగే వాంఖేడి స్టేడియంలో కూడా అడుగుపెట్టాం. టాస్ దగ్గర నుంచి మనకు కలిసి వచ్చింది. అలాగే మన ఫీల్డింగ్ వైఫల్యాలు వారికి కలిసొచ్చినా ఉపయోగం లేకుండా పోయింది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×