E-Paper
Advertisement

TeamIndia: పంత్ కోలుకోవాలని.. క్రికెటర్ల పూజలు

TeamIndia: పంత్ కోలుకోవాలని.. క్రికెటర్ల పూజలు
Advertisement

TeamIndia: న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత ఆటగాళ్లు చెలరేగిపోతున్నారు. రెండు వన్డేల్లో గెలుపొంది ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం నామమాత్రపు మూడో వన్డే కోసం మధ్యప్రదేశ్‌కు వెళ్లారు. ఈనెల 24న ఇండోర్ వేదికగా మూడో వన్డే జరగనుంది.

ఈక్రమంలో టీమిండియా ఆటగాళ్లు కుల్‌దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌తో పాటు పలువురు ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. పరమశివుడిని దర్శించుకొని భస్మా హారతి సమర్పించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్రికెటర్ రిషభ్ పంత్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

రిషభ్ పంత్ జట్టులోకి రావడంతో టీమిండియాకు చాలా ముఖ్యమని సూర్యకుమార్ యాదవ్ అన్నారు. అతడు త్వరగా కోలుకోవాలని పరమశివుడికి ప్రత్యేక పూజలు చేశామని వెల్లడించారు. త్వరలోనే కోలుకొని రిషభ్ జట్టులో చేరుతాడని చెప్పారు.

కాగా, పోయిన ఏడాది డిసెంబర్ 30న రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా పంత్ ప్రయాణిస్తున్న కారు డివైఢర్‌ను ఢీ కొట్టింది. ప్రస్తుతం పంత్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పంత్ కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

Advertisement

Iga Swiatek : నెంబర్‌వన్‌కు షాక్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఔట్..

Ronaldo: వంట మనిషి కోసం వెతుకుతున్న రొనాల్డో.. జీతం రూ. 54 లక్షలు!

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×