E-Paper
Advertisement

IPL : రహానె, దూబె, కాన్వే విధ్వంసం.. టాప్ ప్లేస్ కు చెన్నై..

IPL : రహానె, దూబె, కాన్వే విధ్వంసం.. టాప్ ప్లేస్ కు చెన్నై..
Advertisement

IPL : చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. కోల్ కతా నైట్ రైడర్స్ ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (35), డెవాన్ కాన్వే (56), రహానె (71 నాటౌట్), శివమ్ దూబె (50) చెలరేగడంతో ధోని సేన భారీ స్కోర్ సాధించింది. చెన్నై బ్యాటర్లు ఫోర్లు కంటే సిక్సులే ఎక్కువగా కొట్టారు. మొత్తం 14 ఫోర్లు, 18 సిక్సులు బాదారు.

కోల్ కతా బౌలర్లలో కుల్వంత్ కు 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, సుయాంశ్ శర్మకు తలో వికెట్ దక్కాయి. సుయాంశ్ మినహా మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. చెన్నై బ్యాటర్లను ఏమాత్రం అడ్డుకోలేకపోయారు.

Advertisement

236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా ఆదిలోనే తడబడింది. ఒక పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు నారాయణ్ జగదీశన్ (1), సునీల్ నరైన్ (0) దారుణంగా విఫలమయ్యారు. వెంకటేష్ అయ్యర్ (20), నితీశ్ రాణా (27) కాసేపు నిలబడినా భారీ స్కోర్ సాధించలేకపోయారు. దీంతో నైట్ రైడర్స్ 70 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ జెసన్ రాయ్ (61), రింకూ సింగ్ ( 53 నాటౌట్ ) హాఫ్ సెంచరీలతో పోరాటం చేశారు. అయితే చివరికి కోల్ కతా 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో చెన్నై 49 పరుగుల తేడాతో గెలిచింది.

విధ్వంసకర బ్యాటింగ్ తో చెన్నై భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన రహానెకు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తాజా విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ధోని సేన 7 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించింది. 2 మ్యాచ్ ల్లో మాత్రమే ఓడింది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×