E-Paper
Advertisement

Mohsin Naqvi: న‌ఖ్వీ జిత్తుల‌మారి నక్క‌, బంగ్లాను 10 ఏళ్లు వెన‌క్కి లాగాడు..ఇండియాతో గొడ‌వ‌లో BCB యూట‌ర్న్‌

Mohsin Naqvi: న‌ఖ్వీ జిత్తుల‌మారి నక్క‌, బంగ్లాను 10 ఏళ్లు వెన‌క్కి లాగాడు..ఇండియాతో గొడ‌వ‌లో BCB యూట‌ర్న్‌
Advertisement

Mohsin Naqvi:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో చివరి క్షణంలో బంగ్లాదేశ్ వైదొలిగిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ లో ( Bangladesh) హిందువులపై దాడులు, ఆ త‌ర్వాత ముస్తాఫిజుర్ రెహ్మ‌న్ ఐపీఎల్ ఆడ‌కుండా బ్యాన్ విధించిన‌ నేపథ్యంలో వివాదం చెలరేగి టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ వైదొల‌గాల్సి వచ్చింది. దానికి తోడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీ మసాలా చ‌ల్లి రెచ్చ‌గొట్టాడు. దీంతో బీసీసీఐపై బంగ్లాదేశ్ ఎగిరి పడింది. త‌ట‌స్థ వేదిక ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తూ, పాకిస్తాన్ చెప్పిన‌ట్లు బంగ్లాదేశ్ ఆడింది. దీనికి ఐసీసీ ఒప్పుకోలేదు. చివరికి టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) బహిష్కరించింది బంగ్లాదేశ్. దీంతో కోట్లల్లో బంగ్లాదేశ్ నష్టపోయింది. ఇక ఇప్పుడు తప్పు తెలుసుకున్న బంగ్లాదేశ్.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB) చైర్మన్ మొక్సిన్ న‌ఖ్వీని ( pcb Mohsin Naqvi ) ఉద్దేశించి విమర్శలు చేస్తోంది. యూటర్న్ తీసుకున్న బంగ్లాదేశ్ ( Bangladesh)…మొక్సిన్ న‌ఖ్వీ కారణంగానే తమ క్రికెట్ బోర్డ్ నాశనమైందని అంటోంది.

Also Read: Albie vs Morne Morkel: మోర్కెల్ కుటుంబంలో చిచ్చు పెట్టిన‌ ఇండియా, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్..ఆ త‌ల్లి గుండె కోత ఎవ‌రికి చెప్పుకోవాలి

న‌ఖ్వీ జిత్తుల‌మారి నక్క‌, బంగ్లాను 10 ఏళ్లు వెన‌క్కి లాగాడు

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియాలో పర్యటించకుండా బంగ్లాదేశ్ ను ఆపింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొక్సిన్ న‌ఖ్వీ అంటూ బంగ్లాదేశ్ మాజీ భద్రతాధికారి సయ్యద్ హక్ ( BCB FORMER SECURITY SYED HAQUE) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ జిత్తుల మారి నక్క మొక్సిన్ న‌ఖ్వీ మాటలు విని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ దారి తప్పిందని హాట్ కామెంట్స్ చేశారు. ఆ మొక్సిన్ న‌ఖ్వీ గాడి వల్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మరో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందన్నారు. ఇప్పుడు ఐసీసీ తీసుకోబోయే యాక్షన్ కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ బలి కావాల్సిందేనన్నారు.

దీని అంతటికి కారణం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొక్సిన్ న‌ఖ్వీ అంటూ ఫైర్ అయ్యారు సయ్యద్ హక్. మొక్సిన్ న‌ఖ్వీ మాట విని, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌కుండా బంగ్లాదేశ్ బ‌హిష్క‌రించింద‌ని తెలిపారు. ఇప్పుడు బాధ‌ప‌డాల్సిన పరిస్థితి ఏర్ప‌డింద‌ని ఫైర్ అయ్యారు స‌య్య‌ద్ హ‌క్‌. వెన‌క ఉండి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పెద్ద‌ల‌ను మొక్సిన్ న‌ఖ్వీ రెచ్చ‌గొట్టాడ‌ని, చివ‌ర‌కు చేతులు దులుపుకున్నాడ‌ని ఆగ్ర‌హించారు. ఇప్పుడు 10 ఏళ్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును వెన‌క్కి నెట్టి, స‌ర్వ‌నాశ‌నం చేశాడ‌ని సీరియ‌స్ అయ్యారు.  దీంతో బంగ్లాదేశ్ మాజీ భద్రతాధికారి సయ్యద్ హక్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

అస‌లు వివాదం ఏంటి ?

Advertisement

కాగా హిందువుల‌పై బంగ్లాదేశ్ లో దాడులు జ‌రుగుతోన్న నేప‌థ్యంలో ముస్తాఫిజుర్ రెహ్మ‌న్ ఐపీఎల్ ఆడ‌కుండా బీసీసీఐ నిర్న‌యం తీసుకుంది. దీంతో తాము ఇండియాకు రాబోమ‌ని, పాకిస్తాన్ చెప్పిన‌ట్లు విన్న బంగ్లా, టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ బహిష్కరించింది.

Also Read:  CT 2029-WC 2031 Fact Check: ఇండియాను దెబ్బ‌కొట్టిన పాకిస్తాన్‌..ఐసీసీ ఈవెంట్లు ర‌ద్దు..ఇక బీసీసీఐ రోడ్డున ప‌డ‌ట‌మే !

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×