E-Paper
Advertisement

IND vs ENG : ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్.. విరాట్ కోహ్లీ ప్లేస్ లో రింకూ సింగ్?

IND vs ENG :  ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్.. విరాట్ కోహ్లీ ప్లేస్ లో రింకూ సింగ్?
Advertisement
India vs England

IND vs ENG : ఇంగ్లాండ్ తో ప్రారంభమయ్యే తొలి రెండు టెస్టులకు విరాట్ కొహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. అయితే తన ప్లేస్ ను భర్తీ చేసేందుకు నలుగురి పేర్లు తెరమీదకు వస్తున్నాయి. అయితే అధికారికంగా ఇంకా ఎవరి పేరు ప్రకటించలేదు. కానీ అనూహ్యంగా రింకూ సింగ్ పేరు తళుక్కుమని మెరిసేలా ఉంది.

రంజీట్రోఫీలో ఉత్తరప్రదేశ్ తరపున ఆడుతున్న రింకూ సింగ్ ని కొహ్లీ ప్లేస్ లో బ్యాకప్ గా తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకు తగినట్టుగా ఇంగ్లాండ్ లయన్స్ తో జరుగుతున్న అనధికార రెండో టెస్ట్ సిరీస్ కి రింకూని ఉన్నపళంగా ఎంపిక చేశారు. నిజానికి భారత్ ఏ జట్టులో మూడో టెస్ట్ కి మాత్రమే తనని ఎంపిక చేశారు. ఇప్పుడు రెండో టెస్ట్ కి ప్రమోట్ చేశారు.

Advertisement

కారణం ఏమిటంటే, ఒకవేళ విరాట్ కొహ్లీ మిగిలిన మూడు టెస్ట్ లకి కూడా అందుబాటులో లేకపోతే రింకూ సింగ్ కి ప్రమోషన్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇంగ్లాండ్ బజ్ బాల్ వ్యూహం అమలు చేస్తుందని తెలిడంతో, టీమ్ ఇండియా కూడా హిట్టర్లకు అవకాశాలిస్తోంది. అయితే ప్రస్తుతం రింకూ సింగ్ తన ఫామ్ తో టీ20ల్లో ఆకట్టుకుంటున్నాడు.

కోహ్లి స్థానానికి రింకూ సింగ్ కాకుండా సీనియర్ ప్లేయర్ పుజారాతో పాటు రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం రంజీట్రోఫీలో సౌరాష్ట్రలో జట్టులో పుజారా, భారత్-ఎ జట్టులో యువ ప్లేయర్లు రజత్, సర్ఫరాజ్ ఉన్నారు.

Advertisement

రజత్, సర్ఫరాజ్‌లలో ఒకరు కోహ్లి ప్లేస్‌లో టీమిండియాలోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. కాకపోతే వీరిని దాటి రింకూ సింగ్ వెళ్లిపోయాడని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పుజారా రంజీల్లో డబుల్ సెంచరీ సాధించి ఉన్నాడు. తనకి అవకాశం ఇస్తారా? లేదా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఈ నేపథ్యంలో మూడు ఫార్మాట్లకు రింకూ సింగ్ ని సిద్ధం చేసేలా బీసీసీఐ కీలక చర్యలు చేపడుతోందనేది అర్థమవుతోంది. రింకూని తక్షణమే భారత్-ఎ జట్టుతో చేరమని బీసీసీఐ అతడికి మంగళవారం కీలక ఆదేశాలు జారీచేసింది. ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో జరగనున్న రెండో టెస్టుకు ఎంపిక చేస్తూ రింకూకి కబురు పంపింది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×