E-Paper
Advertisement

Matthew Wade : కుర్రాళ్ల వల్లే ఓడిపోయాం: ఆసిస్ కెప్టెన్

Matthew Wade : కుర్రాళ్ల వల్లే ఓడిపోయాం: ఆసిస్ కెప్టెన్
Advertisement

Matthew Wade : విశాఖలో ముగిసిన టీ20 మ్యాచ్ పై ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వెడ్ స్పందించాడు. కుర్రాళ్ల వల్లే ఓడిపోయామని తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా వైజాగ్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో టీమిండియా చేతిలో ఓటమిపాలైంది.

ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఆసిస్ కెప్టెన్ మాట్లాడుతూ  టీమ్ ఇండియా కుర్రాళ్ల బ్యాచ్ తో ఆడినప్పుడు మూడు అంశాలు గుర్తు పెట్టుకోవాలని తెలిసొచ్చిందని అన్నాుడు. ఒకటి మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉంది. వారే మ్యాచ్ ని నిలబెట్టారు. వాళ్ల మీద ఫోకస్ పెట్టాలి.

Advertisement

రెండు విశాఖ పట్నం గ్రౌండ్ చిన్నదిగా ఉంది. అందుకని ఇక్కడ మేం యార్కర్లు సంధించాలి. అక్కడ మా బౌలర్లు విఫలమయ్యారు. సరిగ్గా బాల్ బ్యాట్ మీదకి వచ్చేసరికి సూర్య, ఇషాన్ కిషన్, రింకూ సింగ్ విధ్వంసం సృష్టించారని అన్నారు. మూడు టీ 20 బ్యాచ్ కుర్రాళ్లకు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. అది ఇప్పుడు పనికొచ్చింది. అందుకని మేం రాబోవు మ్యాచ్ ల్లో  మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నాడు.

ఇకపోతే తమ టీమ్ లో జోష్ ఇంగ్లిస్ ఇరగదీసి ఆడాడని అన్నాడు. తనొక్కడి సెంచరీతో మాకు భారీ స్కోరు దక్కింది. అయితే డిఫెండ్ చేసుకోవడానికి ఈ స్కోర్ చాలని అనుకున్నాం. కానీ సాధ్యమవలేదు. అయితే ఎల్లిస్ చివర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మ్యాచ్ ని ఆఖరి ఓవర్ వరకు తీసుకెళ్లాడు. బెహ్రెండార్ఫ్, తన్వీర్ సంఘా అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ యార్కర్లను సంధించలేకపోయాం. అదీకాకుండా చిన్న మైదానం కావడంతో వాటిని ఆపలేకపోయామని అన్నాడు.

Advertisement

అయితే ఆసిస్ కెప్టెన్ టీమ్ ఇండియా టీ 20 బ్యాచ్ పై చేసిన మూడు అంశాలు సంచలనం సృష్టిస్తున్నాయి. కుర్రాళ్ల టీమ్ పై అద్భుత విశ్లేషణ చేశాడు. దీనిని టీమ్ మేనేజ్మెంట్ జాగర్తగా గమనించి వచ్చే మ్యాచ్ ల్లో ఆసిస్ ఈ అంశాలపై ఫోకస్ పెడుతుంది కాబట్టి, ఆ దిశగా దృష్టి పెట్టాలని అంటున్నారు. ఒకవేళ మిడిలార్డర్ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి, అంతకుముందే ఓపెనర్లు నిలదొక్కుకోవాలని సూచిస్తున్నారు. దీనిపై హెడ్ కోచ్ లక్ష్మణ్ ఫోకస్ చేయాలని, ప్లాన్ ఆఫ్ యాక్షన్ మార్చాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×