E-Paper
Advertisement

Match : మ్యాచ్ ముగిశాకా.. పాక్-జింబాబ్వే ఫైట్!

Match : మ్యాచ్ ముగిశాకా.. పాక్-జింబాబ్వే ఫైట్!
Advertisement

Match : T20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఆ ఫైట్ ముగిసినా… రెండు దేశాల అభిమానుల మధ్య మాటల యుద్ధం మాత్రం ఆగడం లేదు. అది చివరికి దేశాధినేతల రేంజ్ కు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.

మ్యాచ్ కు ముందు పాక్ క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను ఓ అభిమాని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అవి చూసిన వెంటనే జింబాబ్వే అభిమాని ఒకరు స్పందించారు. క్రికెట్ తో ఏ మాత్రం సంబంధం లేని 2016 నాటి ఓ వివాదాన్ని గుర్తు చేస్తూ… మ్యాచ్ లో ఈ వ్యవహారాన్ని సెటిల్ చేస్తామంటూ హెచ్చరించాడు. జింబాబ్వే చేతిలో ఓటమి తప్పించుకోవాలంటే వాన రాకూడదని ప్రార్థించాలని సూచించాడు. అతను అన్నట్లే పాక్ పై జింబాబ్వే గెలిచింది. అంతే… జింబాబ్వే అభిమానులు సోషల్ మీడియాలో పాకిస్థాన్ జట్టును, వారి అభిమానులను వెక్కిరించడం మొదలెట్టారు. దీనికి జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్‌ కూడా తోడయ్యారు. జింబాబ్వే విజయం అద్భుతమన్న ఆయన… జట్టుకు అభినందనలు చెబెతూ… వచ్చేసారి నిజమైన మిస్టర్‌ బీన్‌ను పంపండి అంటూ పాక్‌ను వెక్కిరిస్తూ ట్వీట్‌ చేశారు. దీనికి పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ స్పందించారు. జింబాబ్వే అధ్యక్షుడి ట్వీట్‌ను రీ ట్వీట్‌ చేస్తూ… తమ దగ్గర అసలైన మిస్టర్‌ బీన్‌ ఉండకపోవచ్చు కానీ… అసలైన క్రికెట్‌ స్ఫూర్తి ఉందని కౌంటర్ ఇచ్చారు. పాక్ క్రికెట్ టీమ్ కు అద్భుతంగా పుంజుకునే తమాషా అలవాటు ఉందని ట్వీటారు. మీ జట్టు నిజంగా బాగా ఆడింది.. అభినందనలు మిస్టర్ ప్రెసిడెంట్ అంటూ జింబాబ్వే అధ్యక్షుడికి రిప్లై ఇచ్చారు. దాంతో… అసలేంటీ మిస్టర్ బీన్ వివాదం అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

Advertisement

2016లో జింబాబ్వేలో నిర్వహించిన కొన్ని కామెడీ షోలకు… మిస్టర్‌ బీన్‌ను పోలి ఉండే పాక్‌ కమెడియన్ ఆసిఫ్‌ మహమ్మద్‌ను ఆహ్వానించారు… నిర్వాహకులు. కానీ… అతని ప్రదర్శన జింబాబ్వే ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. నిజమైన మిస్టర్ బీన్ వస్తున్నాడని చాలా మంది టికెట్లు కొని కామెడీ షోకి వచ్చారని… అసలు విషయం తెలిసి మధ్యలోనే వెళ్లిపోయారని… అప్పట్లో అక్కడి మీడియా కోడైకూసింది. దాంతో… ఈ విషయంలో పాక్ ను ఓ ఆటాడుకుందామని జింబాబ్వే జనం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు పాక్ పై జింబాబ్వే గెలవడంతో… పాత వివాదాన్ని గెలికి… కొత్తగా మాటల యుద్ధం చేస్తున్నారు. ఈ విషయం తెలిశాక… ఇదేం గోలరా బాబూ అంటూ నెటిజన్లు బుర్ర గోక్కుంటున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×