E-Paper
Advertisement

Ambani – Rohit: బలుపు తగ్గించుకో రోహిత్… అంబానీ వార్నింగ్?

Ambani – Rohit: బలుపు తగ్గించుకో రోహిత్… అంబానీ వార్నింగ్?
Advertisement

Ambani – Rohit: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గత కొంతకాలంగా పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఐదు టెస్టుల ఆస్ట్రేలియా సిరీస్ లోనూ తన చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రోహిత్ శర్మ మొదటి టెస్ట్ కి దూరంగా ఉండగా.. ఆ మొదటి టెస్ట్ భారత జట్టు గెలుపొందింది. ఇక రెండవ టెస్ట్ కి రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించారు. ఈ టెస్ట్ లో భారత్ ఘోర ఓటమిపాలైంది.

Also Read: Yuvraj Singh on Rohit Virat: ఎవర్రా మీరంతా.. రోహిత్, కోహ్లీని తిట్టడానికి? యువరాజ్ సీరియస్!

Advertisement

అనంతరం జరిగిన మూడవ టెస్ట్ వర్షం కారణంగా డ్రా గా ముగిసింది. ఇక నాలుగవ టెస్ట్ లో మరోసారి ఓడిపోవడంతో చివరి టెస్ట్ లో అతడు బరిలోకి దిగలేదు. ఈ నేపథ్యంలో అతడి కెరీర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇక అతడు ఆటకు స్వస్తి పలకబోతున్నాడు అనే అనుమానాలు వెలువడ్డాయి. కానీ తాను రిటైర్ కావడం లేదని స్పష్టం చేశాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే రోహిత్ కి మరో షాక్ తగిలింది. ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ రోహిత్ శర్మ కి వార్నింగ్ ఇచ్చింది.

ఐపీఎల్ – 2025 కి ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటినుండే జట్లు ప్రిపరేషన్ మొదలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, బుమ్రా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి ప్లేయర్లకు అంబానీ వార్నింగ్ ఇచ్చారని సమాచారం. ఇప్పటినుండే జట్టు ఆటగాళ్లు అంతా కలసికట్టుగా ఉండాలని.. ఐకమత్యంతో ముందుకు వెళితేనే గెలుపు సాధ్యమవుతుందని సూచించారట. ఆటగాళ్ల మధ్య ఎటువంటి గొడవలు, అలకలు లేకుండా సక్యతగా ఉండాలని స్పష్టం చేసిందట.

Advertisement

వినకపోతే కఠిన చర్యలు ఉంటాయని ముంబై {Ambani – Rohit} యాజమాన్యం హెచ్చరించిందని సమాచారం. గత సంవత్సరం ట్రాన్స్ఫర్ విండో ద్వారా గుజరాత్ టైటాన్స్ జట్టు నుండి ముంబై ఇండియన్స్ లోకి వచ్చాడు హార్దిక్ పాండ్యా. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు. అయితే ఈ నిర్ణయం ఆ జట్టు అభిమానులకు నచ్చలేదు. దీంతో ముంబై మ్యాచ్ ల సందర్భంగా పాండ్యాని తీవ్రంగా గేలి చేసేవారు. జట్టులోని ఆటగాళ్లు సైతం పాండ్యాకి సహకరించలేదనే వార్తలు వెలవడ్డాయి.

ఈ క్రమంలో గత సీజన్ లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం 4 మ్యాచ్ లు మాత్రమే గెలుపొంది పాయింట్లు పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. దీంతో హార్దిక్ పాండ్ అని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తారని, లేదంటే రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, బుమ్రా, తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ జట్టును వీడతారని కథనాలు వచ్చాయి. కానీ ముంబై ఇండియన్స్ ఈ ఐదుగురు ఆటగాళ్లని రిటైన్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే 2025 సీజన్ లో మరోసారి జట్టు సభ్యుల మధ్య విభేదాలు ఉండకుండా అందరూ ఐక్యంగా ఉండాలని ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ వార్నింగ్ ఇచ్చిందని తెలుస్తోంది.

Also Read: Harbhajan Singh: నువ్వు వచ్చి.. టీమిండియాను నాశనం చేశావ్ ? గంభీర్‌ పై భజ్జీ సీరియస్‌ !

ముంబై ఇండియన్స్ ఐపీఎల్ – 2025 జట్టు:

హార్దిక్ పాండ్యా (కేప్టెన్), బుమ్రా, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, బౌల్ట్, నమన్ ధీర్, రాబిన్ మింజ్, కర్ణ్ శర్మ, ర్యాన్ రికెల్టన్, దీపక్ చాహర్, అల్లా గజణ్ఫర్, విల్ జాక్స్, అశ్వని కుమార్, మిచెల్ శాంట్నర్, రీస్ టోప్లీ, కృష్ణన్ శ్రీజిత్, రాజ్ అంగద్, సత్యనారాయణ రాజు, బెవాన్ జాకబ్స్, అర్జున్ టెండూల్కర్, లిజాద్ విలియమ్స్, విగ్నేష్ పుత్తూరు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×