E-Paper
Advertisement

Sourav Ganguly: 85 శాతం కంటి చూపు కోల్పోయిన పాకిస్తాన్ క్రికెట‌ర్‌..రంగంలోకి టీమిండియా ప్లేయ‌ర్లు, 14 మంది సంచ‌ల‌న లేఖ‌

Sourav Ganguly: 85 శాతం కంటి చూపు కోల్పోయిన పాకిస్తాన్ క్రికెట‌ర్‌..రంగంలోకి టీమిండియా ప్లేయ‌ర్లు, 14 మంది సంచ‌ల‌న లేఖ‌
Advertisement

Sourav Ganguly: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ( Imran Khan ) ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తోంది. ప్రస్తుతం రావాల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతని కుడి కన్ను దాదాపు 85% దెబ్బతిందట. ఇప్పటికిప్పుడు సరైన వైద్య సదుపాయం అందించకపోతే, పూర్తిగా ఆయన కంటిచూపు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందట. ఇలాంటి నేపథ్యంలో ఇండియాకు చెందిన మాజీ క్రికెటర్లు ఇమ్రాన్ ఖాన్ ( Imran Khan ) ఆరోగ్యం పై స్పందిస్తున్నారు. తమ శత్రుదేశం అయినప్పటికీ, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని టీమిండియా మాజీ క్రికెటర్లు పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇందులో సౌరవ్ గంగూలీ కూడా ఉన్నారు.

Also Read: IND VS PAK: ఇక‌ పాకిస్తాన్ కు సిగ్గు రాదు..గెల‌వ‌డం చేత‌కాక‌, చివ‌ర‌కు హిట్ వికెట్ చేసేందుకు కుట్ర‌

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం పై సౌరవ్ గంగూలీ సీరియస్

Advertisement

కంటి చూపు కోల్పోయే ప్రమాదంలో ఉన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం పై బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ ( Sourav Ganguly ) స్పందించారు. ప్రపంచ ప‌ఠంలో పాకిస్తాన్ ఉండడానికి కారణం ఇమ్రాన్ ఖాన్ అని.. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టడం దారుణం అంటూ ఫైర్ అయ్యారు సౌర‌వ్ గంగూలీ. వెంటనే ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని తాజాగా కోరారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కూడా ఇమ్రాన్ ఖాన్ అందించిన సేవలు అంతా ఇంతా కాదని వెల్లడించారు. అన్ని రంగాల్లో పాకిస్తాన్ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అని కొనియాడారు. అలాంటి వ్యక్తి జైల్లో అనారోగ్యం బారిన పడితే పట్టించుకోవాల్సిన బాధ్యత పాకిస్తాన్ సర్కారుపై ఉందని నిప్పులు చెరిగారు సౌర‌వ్ గంగూలీ. ఇమ్రాన్ ఖాన్ కు వెంటనే ట్రీట్మెంట్ అందించాలని కోరారు.

ఇమ్రాన్ ఖాన్ కోసం కపిల్, గవాస్కర్ తోపాటు 14 మంది మాజీ క్రికెటర్ల లేఖ

పాకిస్తాన్ లోని రావాల్పిండి జైలులో చిప్పకూడు తింటున్న మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అనారోగ్యంపై టీమిండియా మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. 85 శాతం కంటి చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ కు అన్ని సౌకర్యాలు కల్పించాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి 14 మంది టీమిండియా మాజీ క్రికెటర్లు లేఖ రాశారు. ఇందులో భారత లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ అలాగే సౌరవ్ గంగూలీ లాంటి ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్రమక్రమంగా చినిస్తోంది. ఇది ఇలా ఉండగా 1992లో వరల్డ్ కప్ పాకిస్తాన్ కు అందించింది ఇమ్రాన్ ఖాన్ కావడం గమనార్హం. 2018 నుంచి 2022 వరకు పాకిస్తాన్ ప్రధానిగా కూడా ఆయన కొనసాగారు.

Advertisement

Also Read: IND vs PAK cricketers car collection: టీమిండియా, పాక్ క్రికెట‌ర్ల కార్ల క‌లెక్ష‌న్‌, వర్త్ వర్మ వర్త్.. క‌ళ్లు చెదిరిపోవాల్సిందే

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×