E-Paper
Advertisement

Bhartha Mahasayulaku Wignyapthi OTT: ఫైనల్ గా ఓటీటీలోకి రానున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Bhartha Mahasayulaku Wignyapthi OTT: ఫైనల్ గా ఓటీటీలోకి రానున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!
Advertisement

Bhartha Mahasayulaku Wignyapthi OTT: ఈ కాలంలో థియేటర్లలో విడుదలైన సినిమాలు చాలా త్వరగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలోకి వచ్చేస్తున్నాయి. సాధారణంగా రెండు లేదా మూడు వారాల..తర్వాతే ప్రేక్షకులు ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూసే అవకాశం పొందుతున్నారు. కానీ రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా మాత్రం ఓటీటీ విడుదల విషయంలో కొంత ఆలస్యం ఎదుర్కొంది.

మొదట ఈ సినిమాను ఫిబ్రవరి రెండో వారం నుంచే ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణయం వాయిదా పడింది. దీంతో అభిమానులు ఈ సినిమా డిజిటల్ విడుదల కోసం కొంతకాలం ఎదురుచూడాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం ఆ ఎదురుచూపులకు ముగింపు వచ్చింది.

స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Advertisement

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 ఈ సినిమా డిజిటల్.. హక్కులను కొనుగోలు చేసింది. అధికారిక సమాచారం ప్రకారం ఈ సినిమా మార్చి 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓ ప్రత్యేక ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.

సంక్రాంతి పండుగకు రెండు రోజుల ముందే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. సినిమా విడుదలైన తర్వాత పెద్దగా అద్భుతమైన రివ్యూలు రాకపోయినా, కుటుంబంతో కలిసి చూడదగ్గ సరదా చిత్రం.. అనే పేరు మాత్రం సంపాదించింది. ముఖ్యంగా రవితేజ తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను బాగా నవ్వించాడు.

కథ ఏమిటంటే..!

Advertisement

ఈ సినిమాలో రవితేజ ఇద్దరు మహిళల మధ్య చిక్కుకున్న వ్యక్తిగా కనిపిస్తాడు. అతని పాత్రలో ఉన్న హాస్యం ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. అయినప్పటికీ థియేటర్లలో కలెక్షన్ల పరంగా మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

సినిమా మొత్తం రన్‌లో దాదాపు 13 కోట్ల రూపాయల వరకు మాత్రమే వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాకు జరిగిన వ్యాపారం దాదాపు 19 కోట్ల రూపాయలు. అందువల్ల బ్రేక్ ఈవెన్ సాధించడానికి ఇంకా ఎక్కువ కలెక్షన్లు రావాల్సి ఉంది. చివరికి ఈ సినిమా కొంత నష్టంతోనే థియేటర్ రన్‌ను ముగించింది.

కథ విషయానికి వస్తే..రామ్ అనే వ్యక్తి జీవితంలో ఇద్దరు మహిళలు రావడంతో అతని జీవితం ఎలా మారుతుంది అనే అంశంపై సినిమా సాగుతుంది. ఒకరికి పెళ్లైన విషయం మరోకరికి తెలియకపోవడం వల్ల జరిగే సంఘటనలు కథలో ఆసక్తిని పెంచుతాయి. చివరికి ఈ పరిస్థితి ఎలా పరిష్కారమవుతుంది అనేది సినిమాలో ప్రధాన అంశం. ఇప్పుడు థియేటర్లలో మిస్ అయిన వారు మార్చి 13 నుంచి ఓటీటీలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు.

ALSO READ: Vijay Rashmika: రష్మికకు కానుకగా 90 కోట్ల విల్లా.. అసలు విషయం చెప్పిన విజయ్ మేనమామ!

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×