E-Paper
Advertisement

Mathuvadalara 2: ఓటీటీ డేట్ ఫిక్స్.. రేటింగ్ గ్యారంటీ..!

Mathuvadalara 2:  ఓటీటీ డేట్ ఫిక్స్.. రేటింగ్ గ్యారంటీ..!
Advertisement

Mathuvadalara 2.. ఆస్కార్ గ్రహీత సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి (Sri Simha Koduri) హీరోగా, కమెడియన్ సత్య (Satya), ఫరియ అబ్దుల్లా (Faria Abdullah) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మత్తు వదలరా -2. ఈ మూవీ సెప్టెంబర్ 13వ తేదీన థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి సత్య బ్యాక్ బోన్ గా నిలిచారని వార్తలు కూడా వినిపించాయి. ఇక రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ కి ఆడియన్స్ నుంచి విపరీతమైన పాజిటివ్ టాక్ రావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్లతో సునామీ సృష్టించింది ఈ సినిమా.

డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైన మత్తు వదలరా -2

Advertisement

ఫన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ క్రేజీ ఎంటర్టైనర్ నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సెటైరికల్ క్రైమ్ థ్రిల్లర్ శుక్రవారం 11 నుంచి నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కి రాబోతోంది. దసరా పండుగ సందర్భంగా మేకర్స్ ఒక పోస్టర్ని కూడా విడుదల చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.దీంతో ఈ దసరా పండుగకు ఇంట్లో ఇద్దరు అండర్ కవర్ ఏజెంట్లు నవ్వులు పూయించడానికి సిద్ధమవుతున్నారు అంటూ మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీ మేకర్స్ అంచనాలను క్రాస్ చేసి ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూల్ చేసి రికార్డు సృష్టించింది.

మత్తు వదలరా -2 సినిమా కథ..

Advertisement

మత్తు వదలరా -2 సినిమా కథ విషయానికి వస్తే.. మొదటి భాగానికి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డెలివరీ ఏజెంట్లు బాబు (శ్రీ సింహ), ఏసు ( సత్య) ఉద్యోగాల వేటలో ఉంటారు. దొంగ దారిలో హీ టీమ్ లో ఉద్యోగాలు సంపాదిస్తారు. అనుకోకుండా హాయ్ ఎమర్జెన్సీ టీం రిక్రూట్మెంట్ జరుగుతున్న సమయంలో లంచం ఇచ్చి ఉద్యోగం కొనుగోలు చేస్తారు. అయితే నా జీతం ఏమాత్రం కూడా సరిపోకపోవడంతో ఒక కన్నింగ్ ప్లాన్ కూడా వేస్తారు. ఈ క్రమంలోనే కిడ్నాపర్లకు ఇచ్చే డబ్బుల కొంత మొత్తాన్ని దొంగలించడం మొదలు పెడతారు ఇలా సాగిపోతున్న సమయంలో వీరి దగ్గరికి ఒక పెద్ద కేసు అనుకోకుండా వస్తుంది .తన కుమార్తె కనిపించడం లేదని , కిడ్నాపర్లు ఏకంగా రూ .2కోట్లు డిమాండ్ చేస్తున్నారని బాబు, ఏసుకి దామిని (ఝాన్సీ) చెబుతుంది.

అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్..

ఇక దీనిని అదునుగా తీసుకోని, ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వద్దని, ఈ కేసును తామ పర్సనల్గా డీల్ చేస్తామని కూడా వారు చెబుతారు. ఈ క్రమంలోనే అనుకోకుండా ఒక మర్డర్ కేసులో వారు ఇద్దరు ఇరుక్కుంటారు. ఆ తర్వాత బాబు ,యేసుని కావాలని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు? అసలు తేజస్వి తోట తన పేరును ఆకాష్ గా అసలు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది..? ముందుగా ఒక కిడ్నాప్ కేసు కారణంగా ఆకాష్ మర్డర్ కేసులో ఎలా బుక్ అవుతారు..? అసలు ఆకాష్ ను చంపింది ఎవరు..? మర్డర్ కేస్ లో ఇరుక్కున్నవారికి నిధి ( ఫరియా అబ్దుల్లా ) ఎందుకు సహాయం చేసింది..? అసలు దామిని ఎవరు? ఇలా ఎన్నో విషయాలు తెలియాలి అంటే కచ్చితంగా ఈ మత్తు వదలరా -2 చూడాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×