E-Paper
Advertisement

OTT Movie : ఊళ్ళో రచయిత్రిపై దాడి… ఆ దెయ్యాల ఇంటితో సంబంధం… నరాలు తెగే సస్పెన్స్ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ఊళ్ళో రచయిత్రిపై దాడి… ఆ దెయ్యాల ఇంటితో సంబంధం… నరాలు తెగే సస్పెన్స్ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : కేరళలోని పేయవూర్ అనే మారుమూల గ్రామంలో, అర్ధరాత్రి… ఒక రచయిత్రి ఒంటరిగా తన గదిలో ఉంటుంది. అకస్మాత్తుగా ఒక దెబ్బతో నేలకొరుగుతుంది. ఆమె చుట్టూ కొన్ని నీడలు కదులుతాయి. పూవరసి మన అనే పాత ఇంటి గోడల నుండి గుసగుసలు వినిపిస్తాయి. ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారు? ఈ ఇంట్లో దాగిన రహస్యాలు ఆమె జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయి? ఈ రాత్రి ఆమెకు సమాధానాలను ఇస్తుందా? లేక మరింత భయంకరమైన రహస్యాలను వెలికితీస్తుందా? అనేది తెలియాలంటే ఈ హారర్ థ్రిల్లర్ కథ ఏంటి? ఏ ఓటీటీలో ఉందో ముందు తెలుసుకోవాలి.

కథలోకి వెళ్తే…

Advertisement

పేయవూర్ అనే గ్రామంలో ఒక రచయిత్రి (ప్రియాంక నాయర్)పై దాడి జరుగుతుంది. కానీ ఆ దాడి ఎవరు చేశారో తెలియదు. ఈ దాడి గురించి తెలుసుకున్న పోలీసులు విచారణ చేయడానికి పూవరసి మన అనే పాత ఇంటికి చేరుకుంటారు. ఇక్కడే రచయిత్రి కొన్ని భయంకరమైన రహస్యాలను కనిపెడుతుంది. నిజానికి ఆ గ్రామంలో ఈ ఇంటికి ఒక చరిత్ర ఉంటుంది. దెయ్యాల ఇల్లు అని పిలుచుకోవడమే కాదు, ఆ ఇంట్లోకి అడుగు పెట్టడానికి కూడా జనాలు భయపడతారు.

అలాంటి ఇంట్లో అడుగు పెట్టిన రచయిత్రి కొన్ని షాకింగ్ విషయాలను కనిపెడుతుంది. ఇక ఆమెపై జరిగిన దాడి తరువాత గ్రామస్థుల జీవితాలను, వారి గతాన్ని ఇన్వెస్టిగేషన్ ద్వారా మరోసారి రీఓపెన్ చేస్తారు. విచారణలో పోలీసు అధికారి (టీజీ రవి) టీం రచయిత్రి గతానికి, ఈ ఇంటి రహస్యాలతో సంబంధం ఉందన్న విషయాన్ని బయట పెడతారు. హీరోతో పాటు ఇతర స్థానికులు కూడా ఈ కేసులో చిక్కుకుంటారు. ఈ మిస్టరీ థ్రిల్లర్‌ గ్రామీణ నేపథ్యంలో సాగే భయంకరమైన హర్రర్ మూవీ. ఇందులో సస్పెన్స్, ఊహించని ట్విస్టులు మెండుగా ఉంటాయి. ఇంతకీ ఆ లేడీ రైటర్ కు, ఆ ఇంటికి ఉన్న సంబంధం ఏంటి? చివరికి ఆమెపై దాడి చేసింది ఎవరు, ఎందుకు అన్న విషయాలను పోలీసులు కనిపెట్టారా? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీపై ఓ లుక్కేయాల్సిందే.

Advertisement

Read Also : కూతురి బాయ్ ఫ్రెండ్ పై మనసు పడే తల్లి… ఇదెక్కడి దిక్కుమాలిన కథరా సామీ

ఏ ఓటీటీలో ఉందంటే?

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మలయాళ మిస్టరీ థ్రిల్లర్ పేరు ‘Karnika’. 2024లో రిలీజ్ అయిన ఈ మూవీ 10 నెలల తరువాత ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ManoramaMAX, Simply South ఓటీటీలలో అందుబాటులో ఉంది. ఇందులో ప్రియాంక నాయర్, వియాన్ మంగళశేరి, టీజీ రవి, క్రిస్ వేణుగోపాల్, ఆదవ్ రామచంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. అరుణ్ వెన్‌పాల ఈ మూవీకి దర్శకత్వం వహించారు.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×