E-Paper
Advertisement

OTT Movie: రాజుగారి 99 మంది భార్యలను చంపే రాకాసి రాణి… ఓటీటీలో కేక పెట్టిస్తున్న హారర్ థ్రిల్లర్

OTT Movie: రాజుగారి 99 మంది భార్యలను చంపే రాకాసి రాణి… ఓటీటీలో కేక పెట్టిస్తున్న హారర్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఈ రోజు ఒక అదిరిపోయే హర్రర్ థ్రిల్లర్ గురించి చెప్పుకోబోతున్నాము. గుజరాత్‌ లో నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండగా, రాణీవాడా గ్రామం ఒక దారుణమైన మంత్రగత్తె శాపం చీకటిలో కూరుకుపోతుంది. ఆ మంత్రగత్తె పేరు… జమ్కుడి! గర్భా ఆడటం బ్యాన్ చేసిన ఈ గ్రామంలో రూల్స్ పాటించని వారిని భయంకరంగా చంపేస్తారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ బబ్లో, రాజవంశ వారసురాలు కుముద్‌ లు ఈ శాపాన్ని ఎదుర్కొని గ్రామాన్ని రక్షించగలరా? ఈ హర్రర్-కామెడీ రోలర్‌ కోస్టర్‌లో రహస్యం ఏమిటో తెలుసుకోవాలంటే, కథలోకి డైవ్ చేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

Advertisement

గుజరాత్‌ లోని రాణీవాడా గ్రామంలో నవరాత్రి సంబరాలు నిషేధం. ఎందుకంటే ఒక దుష్ట మంత్రగత్తె జమ్కుడి శాపం గ్రామాన్ని కమ్మేసింది. ఈ శాపం ప్రకారం, గర్భా ఆడితే భయంకర పరిణామాలు తప్పవు. అయితే కొంతమంది ఈ రూల్స్ ను పట్టించుకోకపోవడంతో ఈ గ్రామంలో భయంకరమైన హత్యలు మొదలవుతాయి. రియల్ ఎస్టేట్ ఏజెంట్ బబ్లో (విరాజ్ ఘెలానీ), రాజవంశ వారసురాలు కుముద్ (మనసీ పరేఖ్) తమ తెలివితేటలతో ఈ శాపాన్ని ఎదుర్కోవడానికి గ్రామానికి తిరిగి వస్తారు. వాళ్ళు ఇద్దరూ జమ్కుడి రహస్యాన్ని కనిపెట్టి, గ్రామాన్ని రక్షించే ప్రయత్నంలో ఉత్కంఠ, కామెడీ, భయంతో నిండిన ఒక అడ్వెంచర్‌ లో పడతారు. ఈ కథలో గుజరాతీ సంస్కృతి, నవరాత్రి జోష్, సస్పెన్స్‌తో కూడిన క్లైమాక్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. కామెడీ, హర్రర్, డ్రామా కలగలిపిన అద్భుతమైన ఈ సినిమాను గుజరాతీ సినిమా ప్రేమికులకు ఒక పండగలా చేస్తుంది.

Read Also : ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసింది… దెబ్బకు బిలియనీర్ ఐపోయింది మావా

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Advertisement

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ పేరు జమ్కుడి (Jhamkudi). 2024లో విడుదలైన గుజరాతీ హర్రర్-కామెడీ డ్రామా ఇది. షెమరూ మీ (ShemarooMe)లో 2024 అక్టోబర్ 17 నుండి స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. ఈ సినిమా థియేటర్లలో 2024 మే 31న విడుదలై, దాదాపు 25 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్‌ తో ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన గుజరాతీ చిత్రంగా నిలిచింది. ఉమంగ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మనసీ పరేఖ్, విరాజ్ ఘెలానీ, ఓజస్ రావల్, సంజయ్ గోరాడియా, చేతన్ దైయా, జయేష్ మోర్, కృణాల్ పండిత్, భవినీ జానీ తదితరులు నటించారు. పార్థివ్ గోహిల్, మనసీ పరేఖ్ నిర్మించిన ఈ సినిమా 2 గంటల 24 నిమిషాల నిడివితో కామెడీ, హర్రర్, మిస్టరీ జానర్‌లలో రూపొందింది. గుజరాత్‌లోని గోండల్‌లోని 500 ఏళ్ల నాటి ప్యాలెస్‌లో సినిమా చిత్రీకరణ జరిగింది. ఇది సినిమాకు ప్రత్యేకమైన భయానక వాతావరణాన్ని జోడించింది. IMDbలో కూడా రేటింగ్ 7.9/10తో ఉంది. ఈ చిత్రం గుజరాతీ సంస్కృతిని అద్భుతంగా చూపిస్తూ, విజువల్ ఎఫెక్ట్, అఘోరి మ్యూజిక్ బృందం రీమిక్స్ చేసిన టైటిల్ ట్రాక్‌ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×