E-Paper
Advertisement

Gandhi Talks ott : 25 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న విజయ్ సేతుపతి మూవీ… ఈ సైలెంట్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Gandhi Talks ott : 25 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న విజయ్ సేతుపతి మూవీ… ఈ సైలెంట్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Advertisement

Gandhi Talks ott : విజయ్ సేతుపతి నటించిన మాటలు లేని చిత్రం ‘గాంధీ టాక్స్'(Gandhi Talks).  బొంబాయి నేపథ్యంలో సాగే ఈ మూకీ సినిమా, దాదాపు 25 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో అడుగుపెట్టబోతోంది. రెండు రోజుల క్రితం వచ్చిన యూట్యూబ్‌ ట్రైలర్ కి 40 లక్షలకు పైగా వ్యూస్‌ రావడం విశేషం. ఇక ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం పదండి.

థియేటర్లలోకి విజయ్ సేతుపతి మూవీ

ఇటీవలే బిగ్ బాస్ తమిళ సీజన్ 9ని హోస్ట్ చేసిన విజయ్ సేతుపతి నుంచి, ఈ సంవత్సరం వస్తున్న తొలి సినిమా ‘గాంధీ టాక్స్’ (Gandhi Talks). గాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30న విడుదల కానుంది ఈ సినిమా. లాక్‌డౌన్, గ్రామీ, మెలిసై వంటి తమిళ చిత్రాలతో పాటు ఈ సినిమా కూడా విడుదల కానుంది. ఇందులో అరవింద్ స్వామి, అదితి రావు హైదరి, సిద్ధార్థ్ జాదవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కిషోర్ పాండురంగ్ బెలేకర్ దర్శకత్వం వహించాగా, AR రెహమాన్ సంగీతం అందించారు. డబ్బు కోసం మనుషులు ఎంతకి దిగజారుతారు, అవినీతి ఎలా ఉంటుంది అనే విషయాలను ఇందులో వ్యంగ్యంగా చూపించబోతున్నారు. ఇక ఈ సినిమా Zee5 ఓటీటీలో వచ్చే అవకాశం ఉంది.

ఈ సినిమా తీయడానికి ఎందుకు అన్నేళ్ళు పట్టింది 

Advertisement

దర్శకుడు కిషోర్ పాండురంగ్ బేలేకర్ ఈ కథను సుమారు 15 ఏళ్ల పాటు తీర్చిదిద్దారు. తొలుత మూకీ సినిమా అనుకోలేదు, కానీ రాస్తుండగా మాటలు అవసరం లేదని గుర్తించి ప్రయోగాత్మకంగా మార్చారు. మాటలు లేని సినిమా కావడం వల్ల దీనికి సరైన నటీనటులను ఎంపిక చేయడానికి చాలా సమయం పట్టింది. ఇక 2021లో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనా లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ షెడ్యూల్స్ వాయిదా పడ్డాయి. సినిమా నిర్మాణం 2022లో పూర్తయినప్పటికీ, పోస్ట్-ప్రొడక్షన్ పనులు, ఏ.ఆర్. రెహమాన్ సంగీతానికి తగినంత సమయం కేటాయించాల్సి వచ్చింది. చివరగా థియేటర్లలో విడుదలకు ముందే ఈ చిత్రాన్ని 2023లో అంతర్జాతీయ చలనచిత్ర వేదికలపై దీనిని ప్రదర్శించారు.

స్టోరీ ఏమిటంటే

ఒక నిరుద్యోగి (విజయ్ సేతుపతి) జాబ్ లేక, డబ్బులు ఎలా సంపాదించాలో తెలియక ఇబ్బంది పడుతుంటాడు. ఆ టైమ్‌లో తన కష్టాలన్నీ తీరిపోయి సెటిల్ అయిపోవాలని ఒక అడ్డదారి తొక్కుతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పెద్ద బిజినెస్‌మెన్ (అరవింద్ స్వామి) ఆర్థికంగా చిక్కుల్లో పడతాడు. వీరిద్దరి జీవితాలు ఒక పాయింట్ దగ్గర కలిసినప్పుడు, ఒకరినొకరు మోసం చేసుకోవాలని చూసే క్రమంలో వచ్చే పరిస్థితులే ఈ సినిమా. ఈ సినిమాకు ఆ పేరు ఎందుకు పెట్టారంటే.. సమాజంలో మనుషుల మాటల కంటే, కరెన్సీ నోట్ల మీద ఉండే గాంధీ బొమ్మే అందరితో మాట్లాడిస్తుందని దర్శకుడి ఆలోచన. ఇది ఒక మూకీ సినిమా, కాబట్టి కేవలం నటీనటుల ఎక్స్‌ప్రెషన్స్, ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ తోనే కథ మొత్తం నడుస్తుంది.

Advertisement

Read Also :  ‘ది ష్రింకింగ్ సీజన్ 3’ నుండి ‘వండర్ మ్యాన్’ వరకు… ఓటీటీలోకి అడుగు పెట్టిన న్యూ హాలీవుడ్ సిరీసులు ఇవే

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×