E-Paper
Advertisement

Vande Bharat Train Chennai To Mysore : సౌత్ ఇండియాలో వందేభారత్‌ ట్రైన్ ట్రయిల్ రన్ స్టార్ట్.. హైస్పీడ్‌తో కొత్త అనుభూతి..

Vande Bharat Train Chennai To Mysore : సౌత్ ఇండియాలో వందేభారత్‌ ట్రైన్ ట్రయిల్ రన్ స్టార్ట్.. హైస్పీడ్‌తో కొత్త అనుభూతి..
Advertisement

Vande Bharat Train Chennai To Mysore : దక్షిణ భారత దేశంలోనే మొట్టమొదటి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రయల్ రన్ సోమవారం ప్రారంభమైంది. చెన్నై నుంచి మైసూర్ వరకు నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రయల్ రన్ చెన్నైలోని ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభం అయింది. దేశంలో 5వ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 11వ తేదీన పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.

న్యూఢిల్లీ -కాన్పూర్- అలహాబాద్-వారణాసి మార్గంలో మొదటి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు కేంద్రం జాతికి అంకితం చేస్తోంది. దేశంలో నలుమూలలను కలిపేలా 75 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతామని ఆజాదీకా అమృత్ మహోత్సవ్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గత ఏడాది ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోటపై ప్రకటించారు. స్పీడ్, సేఫ్టీ, సర్వీసులతో కూడిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలను చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే ఉత్పత్తి యూనిట్ తయారు చేసింది.

Advertisement

గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణికులకు కొత్త ప్రయాణ అనుభూతిని ఇస్తున్నాయి. ఈ రైళ్లతో ప్రయాణ కాలం సగానికి పైగా తగ్గింది. ఈ రైలు బోగీల్లో ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ బేస్ డ్ ఆడియో, విజువల్ ప్యాసింజర్ సమాచార వ్యవస్థ, వైఫై, అనుకూల సీటింగ్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఛైర్లు, బయోవ్యాక్యూమ్ టాయ్ లెట్లు సదుపాయాలు కల్పించారు. పాంట్రీతోపాటు వేడి వేడి భోజనం, చల్లటి శీతల పానీయాలను ప్రయాణికులకు అందించేలా ఏర్పాట్లు చేశారు.వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో 1128 మంది ప్రయాణికులు కూర్చునేలా సీట్లు ఏర్పాటు చేశారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×