E-Paper
Advertisement

Kerala: బాలుడికి అరుదైన వ్యాధి.. అజ్ఞాతవాసి రూ.11 కోట్ల సాయం

Kerala: బాలుడికి అరుదైన వ్యాధి.. అజ్ఞాతవాసి రూ.11 కోట్ల సాయం
Advertisement

Kerala: మానవ జీవితంలో మార్పులు వస్తున్న కొద్దీ కొత్తకొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్నపాటి రోగం అయితే నయమవుతుంది కానీ.. అరుదైన రోగం బారిన పడితే కోట్ల రూపాయిలు కుమ్మరించాల్సిందే. అయినా కూడా కొన్నిసార్లు ప్రాణాలు దక్కడం లేదు. ఇక మధ్య, పేద తరగతి ప్రజలు చికిత్స కోసం కోట్లరూపాయలు పెట్టలేక.. ప్రాణాలు దక్కించుకోలేక పడే బాధ అంతా ఇంతా కాదు.

ఇలానే కేరళకు చెందిన ఓ బాలుడు అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధికి చికిత్స కోట్ల రూపాయలతో ముడిపడి ఉంది. దీంతో బాలుడి తల్లిదండ్రులు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో ఓ వ్యక్తి దేవుడిలా వచ్చి వారిని ఆదుకున్నాడు. తన పేరు చెప్పకుండానే భారీ సాయం చేశాడు. బాధితుల ఖాతాలో ఏకంగా రూ.11 కోట్లు జమ చేశాడు.

Advertisement

ఎర్నాకుళానికి చెందిన నేవీ ఆఫీసర్ సారంగ్, అతిథి దంపతుల కుమారుడు నిర్వాణ్ పుట్టుకతోనే అరుదైన వ్యాధితో జన్మించాడు. బాలుడికి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధి ఉంది. ఆ వ్యాధి చికిత్సకు రూ. 17.5 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. విదేశీ వైద్యులతో చికిత్స అందించాలని వెల్లడించారు.

అన్ని డబ్బులు పెట్టి చికిత్స అందించే ఆర్థికస్థోమత లేక తల్లిదండ్రులు దాతల సాయం కోరారు. సోషల్ మీడియాలో తమ కుమారుడి పరిస్థితిని వివరిస్తూ ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోకాస్త విదేశాల్లో ఉంటున్న ఓ వ్యక్తి చూశాడు. వెంటనే తన పేరు బయటకు రాకుండా బాధితుల ఖాతాలో రూ.11 కోట్లు జమచేశాడు. ప్రస్తుతం నిర్వాణ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×