E-Paper
Advertisement

AAP : కేజ్రీవాల్ కేబినెట్ లోకి కొత్త మంత్రులు.. ఆ ఇద్దరికి ఛాన్స్..

AAP : కేజ్రీవాల్ కేబినెట్ లోకి కొత్త మంత్రులు.. ఆ ఇద్దరికి ఛాన్స్..
Advertisement

AAP : జైలుకెళ్లిన ఇద్దరు మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా చేయడంతో వారి స్థానాలను భర్తీ చేసేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కసరత్తు చేశారు. కేబినెట్‌లోకి కొత్తగా ఇద్దరిని తీసుకోవాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు ఆతిషీ, సౌరభ్‌ భరద్వాజకు మంత్రులుగా అవకాశం కల్పించనున్నారు. కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడానికి కార్యాచరణను ఇప్పటికే రెడీ చేశారు. ఈ సమాచారాన్ని‌ లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనాకు పంపించారు.

ఇన్నాళ్లు ఆప్ లో కేజ్రీవాల్ తర్వాత స్థానం మనీశ్ సిసోడియాదే. డిప్యూటీ సీఎంగా 18 శాఖల బాధ్యతలు నిర్వహించారు. సీబీఐ అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం జైలులో ఉన్నారు. అలాగే ఆరోగ్యశాఖ మంత్రిగా సత్యేంద్ర జైన్ పనిచేశారు. కొంతకాలంగా ఆయన కూడా జైలులోనే ఉన్నారు. వారిద్దరూ ఇప్పుడు రాజీనామా చేయడంతో మరో ఇద్దరిని మంత్రివర్గంలోకి కేజ్రీవాల్ తీసుకుంటున్నారు.

Advertisement

రాజీనామా తర్వాత ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కు రాసిన లేఖలో మనీశ్‌ సిసోడియా పలు విషయాలను ప్రస్తావించారు. ఎనిమిదేళ్లుగా నిజాయితీగా పనిచేస్తున్నానని తనపై ఉన్న ఆరోపణలన్నీ వాస్తవాలు కాదని స్పష్టం చేశారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ స్వచ్ఛమైన రాజకీయాలకు భయపడి కొందరు బలహీనులు పిరికితనంతో కుట్ర చేశారని పేర్కొన్నారు. వారి అసలైన టార్గెట్ కేజ్రీవాలేనని అన్నారు. కేవలం ఢిల్లీలోనేకాదు దేశ ప్రజలు కేజ్రీవాల్ ను గొప్ప నేతగా చూస్తున్నారని ప్రశంసించారు. సరికొత్త విధానాలతో ప్రజల్లో మార్పు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు.. ఢిల్లీ సీఎం సామర్థ్యాలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందని ఆ లేఖలో పేర్కొన్నారు.

కేజ్రీవాల్ కు రాసిన లేఖలో తన తండ్రి గురించి సిసోడియా ప్రస్తావించారు. విద్య గురించి ఆయన రాసిన మంచి మాటలతో కూడిన చిత్రాన్ని రోజూ ఉదయం లేవగానే చూస్తానని తెలిపారు. తల్లిదండ్రులు పెంపకం వల్లే తనలో విలువలు ఉన్నాయన్నారు. ఏ శక్తి తనను నిజాయితీ లేని వ్యక్తిగా మార్చలేదని స్పష్టం చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×