E-Paper
Advertisement

AAP : ఆప్ అభ్యర్థి కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్.. బీజేపీపై కేజ్రీవాల్ ఆరోపణ..

AAP : ఆప్ అభ్యర్థి కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్.. బీజేపీపై కేజ్రీవాల్ ఆరోపణ..
Advertisement

AAP : గుజరాత్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి కంచన్‌ జరివాలా కిడ్నాప్‌ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మంగళవారం మధ్యాహ్నం అదృశ్యమైన కంచన్‌.. బుధవారం రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వచ్చి తన నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. సూరత్‌ తూర్పు నియోజకవర్గం ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి కంచన్‌ జరివాలా కన్పించట్లేదని బుధవారం ఉదయం ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్ చేశారు. ఆప్ అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకునేలా బీజేపీ ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. నామినేషన్‌ పత్రాల పరిశీలన కోసం కంచన్‌ మంగళవారం మధ్యాహ్నం రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి బయటకు వస్తుండగా కొందరు బీజేపీ నాయకులు ఆయనను బలవంతంగా తీసుకెళ్లారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఆరోపించారు. బీజేపీనే కిడ్నాప్‌ చేసి ఉంటుందని ఆప్‌ నేతలు మండిపడ్డారు.

కేజ్రీవాల్ ట్వీట్‌ చేసిన కొద్ది గంటలకే కంచన్‌ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. కంచన్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆప్‌, బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×