E-Paper
Advertisement

Ayodhya: అయోధ్య రామజన్మభూమి ఆలయానికి బాంబు బెదిరింపు.. హై అలర్ట్

Ayodhya: అయోధ్య రామజన్మభూమి ఆలయానికి బాంబు బెదిరింపు.. హై అలర్ట్
Advertisement

Ayodhya: యూపీలోని అయోధ్యలో రామజన్మభూమి కాంప్లెక్స్‌కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతోంది. గుర్తుతెలియని వ్యక్తి అయోధ్యలో నివాసం ఉంటున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తికి ఫోన్ చేసి రామజన్మభూమి కాంప్లెక్స్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ.. భద్రతను కట్టుదిట్టం చేశారు.

అయోధ్యలోని రాంలాలా సదన్‌కు చెందిన మనోజ్‌ కుమార్‌కు ఈ ఉదయం ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మరికొన్ని గంటల్లో శ్రీరామజన్మభూమి కాంప్లెక్స్‌ను బాంబుతో పేల్చేస్తామని బెదిరించి ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత మనోజ్ ఎన్నిసార్లు చేసినా ఫోన్ స్విఛ్ఛాఫ్ రావడంతో పోలీసులకు సమాచారం అందించాడు.

Advertisement

నిందితుడి కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాల్ ట్రాకింగ్ ఆధారంగా నిందితుడిని అతి త్వరలో గుర్తించి అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.

ఇక ఆలయ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేసి.. భక్తులకు రాములోరి దర్శనం కల్పిస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×