E-Paper
Advertisement

Rajasthan Assembly : పాత బడ్జెట్‌ చదివిన సీఎం .. ఎక్కడంటే..?

Rajasthan Assembly : పాత బడ్జెట్‌ చదివిన సీఎం .. ఎక్కడంటే..?
Advertisement

Rajasthan Assembly : రాజస్థాన్‌ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన జరిగింది. సభలో ఈ ఏడాది బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సీఎం అశోక్ గెహ్లాట్ స్వయంగా బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు. సభ్యులందరూ ఆసక్తిగా వింటున్నారు. అయితే ముఖ్యమంత్రి గెహ్లాట్ బడ్జెట్ ప్రసంగంపై సభలోని సభ్యులకు ఏమీ అర్థం కాలేదు. అధికార పార్టీ సభ్యులు అయోమయానికి గురయ్యారు. విపక్ష బీజేపీ సభ్యులు ఎగతాళి చేశారు. అలా సీఎం గెహ్లాట్ బడ్జెట్ ప్రసంగం ఏడు నిమిషాల పాటు సాగింది.

ఇంతలో అసలు విషయం సీఎం గెహ్లాట్ కు ఆ తర్వాత అర్థమైంది. దీంతో నాలుక కరుచుకున్నారు. అంతే బడ్జెట్ ప్రసంగాన్ని ఆపేశారు. దీంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ సభ్యులు సభలో ఆందోళనలు చేశారు. స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో స్పీకర్‌ సీపీ జోషి సభను 30 నిమిషాలపాటు వాయిదా వేశారు.

Advertisement

ఇంతకీ ఏం జరిగిందంటే..
రాజస్థాన్ లో కొత్త బడ్జెట్‌ ప్రవేశపెట్టే క్రమంలో పాత బడ్జెట్‌ ప్రతులను అసెంబ్లీకి తీసుకొచ్చారు 2023-24 బడ్జెట్‌ను చదివే క్రమంలో గత బడ్జెట్‌ను చదివేశారు. సీఎం అశోక్‌ గెహ్లాట్‌ పాత బడ్జెట్‌ను చదువుతున్నారనే విషయాన్ని హౌజ్‌ గ్యాలరీలో ఉన్న ఫైనాన్స్‌ ఆఫీసర్లు చీఫ్‌ విప్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అసలు విషయాన్ని సీఎం గుర్తించారు. ఏకంగా సీఎం అశోక్ గెహ్లాటే తప్పులో కాలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×