E-Paper
Advertisement

Manipur : సైన్యాన్ని చుట్టుముట్టిన మహిళలు.. 12 మంది మిలిటెంట్లు విడుదల..

Manipur : సైన్యాన్ని చుట్టుముట్టిన మహిళలు.. 12 మంది మిలిటెంట్లు విడుదల..
Advertisement

Manipur : మణిపూర్‌లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు చల్లారలేదు. తాజాగా సైన్యం 12 మంది మిలిటెంట్లను అదుపులోకి తీసుకుంది. అయితే తూర్పు ఇంఫాల్‌లోని ఇథం గ్రామంలో దాదాపు 1,500 మంది మహిళలు భద్రతా బలగాలను చుట్టుముట్టారు. పౌరుల భద్రత నేపథ్యంలో మిలిటెంట్లను సైన్యం విడిచిపెట్టింది.

నిఘావర్గాల సమాచారంతో ఇంథ గ్రామంలో సైన్యం గాలింపులు చేపట్టింది. 12 మంది మిలిటెంట్లను పట్టుకుంది. మైతేయ్‌ మిలిటెంట్‌ గ్రూపు కేవైకేఎల్‌కు చెందినవారీగా గుర్తించింది. 2015లో 6 డోగ్రా యూనిట్‌పై జరిగిన దాడిలో వీరి ప్రమేయం ఉందని ఆర్మీ వెల్లడించింది.ఇ లా అనేక దుశ్చర్యల్లో ఈ మిలిటెంట్ల హస్తం ఉందని తెలిపింది. వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

మిలిటెంట్లను అదుపులోకి తీసుకున్న విషయం తెలియగానే గ్రామస్థులు సైన్యాన్ని చుట్టుముట్టారు. ఇందులో దాదాపు 1,500 మంది మహిళలు ఉన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని సైన్యం వారిని కోరినా వారు పట్టించుకోలేదు. చివరకు సైన్యం మిలిటెంట్లను విడుదల చేసింది. ప్రాణనష్టాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్మీ అధికారులు ప్రకటించారు.

మణిపూర్‌ లో అల్లర్లు చెలరేగుతుంటే ప్రధాని మోదీ మౌనంగా కూర్చున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేష్ విమర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అల్లర్లను నియంత్రించలేకపోయారని మండిపడ్డారు. మణిపూర్‌లో శాంతి అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో జైరాం రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

మణిపూర్‌లో హింస అదుపులోకి వచ్చిందని ఆ రాష్ట్ర సీఎం బీరేన్‌సింగ్‌.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు తెలిపారు. ఢిల్లీలో అమిత్‌ షాతో భేటీ అయిన బీరేన్ సింగ్..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషితో పరిస్థితులు చాలావరకు మెరుగుపడ్డాయని తెలిపారు. మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని అమిత్‌ షా భరోసా ఇచ్చారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×