E-Paper
Advertisement

Singer KS Chithra : రామనామం జపించాలని సందేశం.. గాయని చిత్ర వ్యాఖ్యలపై వివాదం..

Singer KS Chithra : రామనామం జపించాలని సందేశం.. గాయని చిత్ర వ్యాఖ్యలపై వివాదం..
Advertisement

Singer KS Chithra : అయోధ్య ఆలయ మహోత్సవం సందర్భంగా ప్రముఖ గాయని చిత్రపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నెల 22న అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్టాపన జరగనుంది. ఈ సందర్భంగా ప్రజలు రామ నామాన్ని జపించాలని.. సాయంత్రం వేళ 5 ఒత్తుల దీపాన్ని వెలిగించాలని ఆమె దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే ప్రతిఒక్కరికి దేవుడి ఆశీస్సులు అందాలని ప్రార్థించిన ఆమె.. లోక సమస్త సుఖినో భవంతు అంటూ సందేశాన్నిచ్చారు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ వీడియోపై కొందరు నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు.

చిత్ర సందేశంపై గాయకుడు సూరజ్ స్పందించారు.లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పే వారి అమాయత్వమే ఇక్కడ గొప్ప విశేషమని.. మసీదును ధ్వంసం చేసి ఆలయాన్ని నిర్మించిన వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా మరిచిపోతున్నారని వ్యంగంగా కామెంట్ చేశారు. అలాగే చిత్ర ఒక రాజకీయ పక్షంవైపు మొగ్గు చూపుతున్నారని మరికొందరు మండిపడుతున్నారు. అయితే మరో గాయకుడు వేణుగోపాల్‌ చిత్రను సమర్థించారు. తన అభిప్రాయాలను వ్యక్తీకరించే హక్కు, స్వేచ్ఛ ఆమెకు ఉన్నాయని.. తన మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు వేణుగోపాల్‌.

Advertisement

గాయని చిత్రను కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఈ అంశంపై నెట్టింట డైలాగ్ వార్ నడుస్తోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×