E-Paper
Advertisement

Rahul Gandhi : పాట్నాలో విపక్షాల భేటీ.. బీజేపీని ఓడిస్తాం : రాహుల్ గాంధీ

Rahul Gandhi : పాట్నాలో విపక్షాల భేటీ.. బీజేపీని ఓడిస్తాం : రాహుల్ గాంధీ
Advertisement

Rahul Gandhi : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా విపక్షాలు ఏకమయ్యాయి. బిహార్‌ రాజధాని పట్నాలో సమావేశమయ్యాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సహా ప్రధాన విపక్ష నేతలు ఈ మీట్ కు హాజరయ్యారు. వారందరికీ బిహార్ సీఎం నితీశ్‌ కుమార్‌ స్వాగతం పలికారు.

Advertisement

ప్రస్తుతం దేశంలో సిద్ధాంతపరమైన ఘర్షణ జరుగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ భారత్‌ జోడో సిద్ధాంతం, ఆర్ఎస్‌ఎస్‌, బీజేపీ భారత్‌ టోడో సిద్ధాంతానికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. భారత్‌ను విచ్ఛిన్నం చేసేందుకు విద్వేషం, హింసను వ్యాప్తి చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. ఈ చర్యలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. అందుకోసమే విపక్ష నేతలు బిహార్ కు వచ్చారని తెలిపారు. బీజేపీని ఓడిస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో విజయం సాధిస్తామని రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. పేదల పక్షాన నిలబడటం వల్లే విజయం సాధిస్తామన్నారు. బిహార్‌లో కాంగ్రెస్ విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా గెలుస్తుందని మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు.

Advertisement

విపక్షాల భేటీకి మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌, సీపీఎం జనరల్‌ సెక్రటరీ సీతారాం ఏచూరి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్, ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ హాజరయ్యారు . మొత్తం 15 పార్టీల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానం పంపలేదు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×