E-Paper
Advertisement

PM Modi : చిన్నతనం గుర్తు చేసుకున్న మోదీ .. బహిరంగ సభలో భావోద్వేగం..

PM Modi : ప్రధాని నరేంద్రమోదీ మహరాష్ట్ర షోలాపూర్‌లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-అర్బన్‌ పథకం కింద పేద ప్రజలకు ఇళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ సభలో కన్నీటి పర్యంతమయ్యారు.

PM Modi :  చిన్నతనం గుర్తు చేసుకున్న మోదీ ..  బహిరంగ సభలో భావోద్వేగం..
Advertisement

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర షోలాపూర్‌లో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన-అర్బన్‌ పథకం కింద పేద ప్రజలకు ఇళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురైయ్యారు. తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ సభలో కన్నీటి పర్యంతమయ్యారు.

పీఎం ఆవాస్‌ యోజన కింద నిర్మించిన దేశంలోనే అతిపెద్ద సొసైటీని తన చేతులు మీదగా ప్రారంభించడం గర్వంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. తాను 2014లో హామీ ఇచ్చానని గుర్తు చేశారు. హామీ నెరవేర్చడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ ఇళ్లను చూడగానే తన బాల్యం గుర్తొచ్చిందని తెలిపారు. చిన్నతనంలో తనకు కూడా ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వస్తే ఎలా ఉండేదో అని ఆలోచించుకున్నాని పేర్కొన్నారు. భావోద్వేగంతో గద్గద స్వరంతో కార్యక్రమంలో ప్రసంగించారు. కన్నీళ్లను దిగమింగుకుని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Advertisement

కార్యక్రమంలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం గురించి ఆయన ప్రస్తావించారు. ఆ అద్భుత ఘట్టాన్ని పురస్కరించుకుని జనవరి 22న దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో రామజ్యోతి వెలిగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీరాముడి నిజాయితీని తన ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుందని పేర్కొన్నారు. సమాజంలో కట్టుబాట్లను, విలువలను గౌరవించాలని ఆ భగవంతుడు బోధించాడని. అదే బాటలో మా ప్రభుత్వం పయనిస్తోందన్నారు.

ప్రజల కలలు నేరవేర్చడమే తమ లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల పాలనలో సంక్షేమ పథకాలు అందరికీ ప్రజలకు చేరుకోలేదన్నారు. గరీబీ హఠావో పథకం కేవలం నినాదంగా మిగిలిపోయిందని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×