E-Paper
Advertisement

No Confidence Motion News : కేంద్రంపై అవిశ్వాస తీర్మానం.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నోటీసులు.. స్పీకర్ అనుమతి..

No Confidence Motion News : కేంద్రంపై అవిశ్వాస తీర్మానం.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నోటీసులు.. స్పీకర్ అనుమతి..
Advertisement
No Confidence Motion in Parliament

No Confidence Motion in Parliament(Telugu breaking news): మణిపూర్‌ అంశంపై పార్లమెంట్ లోప్రధాని మోదీ ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టిన విపక్ష కూటమి ఇప్పుడు కీలక అస్త్రాన్ని సంధించింది. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ డిప్యూటీ నేత గౌరవ్‌ గొగొయ్‌ అవిశ్వాస తీర్మానంపై స్పీకర్‌కు నోటీసులిచ్చారు. విపక్షాల అవిశ్వాస తీర్మానానికి స్పీకర్‌ అనుమతిచ్చారు. చర్చ సమయాన్ని తర్వాత ప్రకటిస్తానన్నారు.

మరోవైపు బీఆర్ఎస్ కూడా కేంద్రానికి వ్యతిరేకంగా పావులు కదపడం ఆసక్తిని రేపుతోంది. ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా కేంద్రంపై అవిశ్వాస తీర్మాన నోటీసును స్పీకర్ కు ఇచ్చారు. లోక్‌సభ రూల్ నెంబర్ – 198 B ప్రకారం బీఆర్ఎస్ తీర్మానం ఇచ్చింది. బిజినెస్ లిస్ట్ లో తీర్మానాన్ని చేర్చవలసిందిగా నామా కోరారు. బీఆర్ఎస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంతకం చేశారు. తమకు ఎన్డీఏ, ఇండియాతో ఎలాంటి సంబంధం లేదన్నారు బీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి.

Advertisement

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రధాని మోదీ మాట్లాడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. దీంతోపాటు విపక్షాలకు పలు అంశాలు ప్రస్తావించే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్పీకర్‌ కు కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నోటీసులిచ్చాయి.

ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీఏ కూటమికి 330 మంది సభ్యుల బలం ఉంది. విపక్షాల కూటమి ఇండియాకు 140 మంది సభ్యుల మద్దతు ఉంది. వివిధ పార్టీలకు చెందిన 60 మంది సభ్యులు కూటమిలోనూ లేరు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోవడం దాదాపు ఖాయం. కానీ కేవలం మణిపూర్‌ అంశంలో చర్చ కోసం ప్రతిపక్షాలు ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. 2018లో కూడా కేంద్రంపై అప్పటి యూపీఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అప్పుడు ఎన్డీఏకు అనుకూలం 325 , వ్యతిరేకంగా 126 ఓట్లు వచ్చాయి. దీంతో అవిశ్వాసం వీగిపోయింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×