E-Paper
Advertisement

Mumbai: కాలుష్యంలో ఢిల్లీని తలదన్నిన ముంబై

Mumbai: కాలుష్యంలో ఢిల్లీని తలదన్నిన ముంబై
Advertisement

Mumbai: కాలుష్యంలో దేశ రాజధాని ఢిల్లీని ఆర్థిక రాజధాని ముంబై తలదన్నింది. ప్రపంచంలోనే రెండో అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. ప్రపంచ కాలుష్యనగరాల జాబితాలో గత నెల 29న పదో స్థానంలో నిలిచిన ముంబై…. ఆ తర్వాత నాలుగు రోజుల వ్యవధిలో అగ్రభాగాన చేరింది.

స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ ఐక్యూ ఎయిర్ ఈ మేరకు కాలుష్య నగరాలకు ర్యాంకింగ్‌లు ఇచ్చింది. ఐక్యూ ఎయిర్ అనేది ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో కాలుష్య తీవ్రతను పర్యవేక్షించే రియల్ టైం మానిటర్. యూఎన్ఈపీ, గ్రీన్‌పీస్‌తో కలిసి ఎప్పటికప్పుడు…. కాలుష్యం, గాలి నాణ్యత వివరాలను అందిస్తుంటుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి డేటాను పరిగణనలోకి తీసుకుంటుంది. భారత్ కన్నా అత్యంత కఠిన ప్రమాణాలను పాటించే అమెరికా గాలి నాణ్యత సూచీ మేరకు కాలుష్య తీవ్రతను లెక్కిస్తుంది.

Advertisement

మూడు నెలలుగా ముంబైలో ఎయిర్ క్వాలిటీ అత్యంత దారుణంగా పడిపోయింది. గత మూడు శీతాకాల సీజన్ల కన్నా ఈ సారి కాలుష్యం ఎక్కువగా నమోదైనట్టు సీపీసీబీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాహనాల పొగ, రహదారులు, భవన నిర్మాణాలతో దుమ్ము, ధూళి అనూహ్యస్థాయిలో పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. లానినా వల్ల పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి పడిపోయాయి. దీని వల్ల పశ్చిమ తీరంలో గాలుల వేగం తగ్గి.. కాలుష్యకారకాలు ఒక ప్రాంతంలోనే కేంద్రీకృతమయ్యాయి. ఫలితంగా గాలి స్వచ్ఛత తగ్గింది. ముంబై పరిసర ప్రాంతాల్లోని గాలిలో 71% కాలుష్య కారకాలు రోడ్లు, భవన నిర్మాణాల వల్లేనని నీరి, ఐఐటీ-బాంబే పరిశోధనల్లో ఇప్పటికే వెల్లడైంది. మిగిలిన కాలుష్యం ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లు, ఎయిర్‌పోర్టులు, వేస్ట్ డంప్స్ నుంచేనని…. 2020 నాటి ఆ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఇక అత్యంత కాలుష్య నగరాల్లో సరయెవో టాప్‌లో నిలిచింది. బోస్నియా-హెర్జ్‌గోవినా రాజధాని అయిన ఈ నగరంలో ఏక్యూఐ 186గా ఉంది. 163 ఏక్యూఐతో ముంబై రెండో స్థానంలో, 162తో మిలానో మూడో స్థానంలో నిలిచింది. ఇక టాప్ టెన్ కాలుష్య నగరాలను తీసుకుంటే తర్వాతి స్థానాల్లో కోల్‌కతా, లాహోర్ , క్రస్నాయార్హ్ ప్రిస్టినా, హనోయ్ , కరాచీ , లండన్ ఉన్నాయి.

Advertisement

ముంబైతో పాటు ఢిల్లీలో కాలుష్యం తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. మనిషి మనుగడే ప్రశ్నార్ధకంగా మారే అవకాశముందంటున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×