E-Paper
Advertisement

Modi fires on INDIA: ఇండియాపై మోదీ ఫైర్.. అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు రెడీ..

Modi fires on INDIA: ఇండియాపై మోదీ ఫైర్.. అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు రెడీ..
Advertisement
Narendra Modi news today live

Narendra Modi news today live(Latest political news in India): మణిపూర్ అంశం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తోంది. ఈ అంశంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ విపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష ఎంపీల నిరసనలతో పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంపై మండిపడ్డారు. దిశాదశ లేకుండా విపక్ష నేతలు ముందుకెళతున్నారని మోదీ విమర్శించారు.

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ప్రతిపక్షాల తీరును తప్పుపట్టారని కాషాయ పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక లక్ష్యం లేకుండా ముందుకెళ్లే విపక్షాలను తాను ఎప్పుడు చూడలేదని మోదీ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అధికారంలోకి రావాలనుకోవడం లేదని చురకలు అంటించారు. ఎప్పటికీ విపక్షంలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. పేరులో ఇండియా ఉంటే సరిపోదని.. వారు ప్రజలను తప్పుదోవపట్టించేందుకు ఆ పదాన్ని ఉపయోగించారని మండిపడ్డారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ లాంటి సంస్థల పేర్లలో కూడా ఇండియా ఉందని విపక్ష కూటమిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగడంలేదు. మణిపూర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై రగడ కొనసోగుతోంది. ఈ అంశంపై ప్రధాని మోదీ పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ కూటమికి మోదీని వ్యతిరేకించడమేనని ఏకైక ఎజెండా అని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయంపై మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

మరోవైపు విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది. ప్రతిపక్షాల డిమాండ్‌లను కేంద్రం పట్టించుకోవడం లేదని.. అవిశ్వాస తీర్మానం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని విపక్ష నేతలు భావిస్తున్నారు. ఈ రకంగా మణిపూర్ సహా అన్ని అంశాలపై చర్చకు తీసుకురావాలని చూస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×