E-Paper
Advertisement

Vandebharath Rail : సౌత్ కు వందేభారత్‌ రైలు.. ప్రారంభించిన మోదీ

Vandebharath Rail : సౌత్ కు వందేభారత్‌ రైలు.. ప్రారంభించిన మోదీ
Advertisement

Vandebharath Rail: దక్షిణ భారత్ దేశంలో వందే భారత్ రైలు పట్టాలెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులో ఈ రైలును ప్రారంభించారు. బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌ ఎయిర్‌బేస్‌కు చేరుకున్న ప్రధానికి కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోట్, సీఎం బసవరాజ్‌ బొమ్మై, కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషీ స్వాగతం పలికారు. ఆ తర్వాత మోదీ కేఎస్సార్‌ రైల్వే స్టేషన్‌లో వందే భారత్‌ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు బెంగళూరు నుంచి మైసూరు మీదుగా చెన్నై వరకు నడుస్తుంది. దేశంలో ఇది ఐదో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌. ఆ తర్వాత భారత్‌ గౌరవ్‌ కాశీ దర్శన్‌ రైలును ప్రధాని ప్రారంభించారు. యాత్రికుల కోసం తీసుకొచ్చిన ఈ సర్వీసులో 8 రోజుల టూర్‌ ప్యాకేజీ ఉంది. ఈ రైలులో వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ లాంటి పవిత్ర స్థలాలను దర్శించుకోవచ్చు.

అంతకుముందు మోదీ.. ప్రముఖ కవి కనకదాస జయంతిని పురష్కరించుకుని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత మహర్షి వాల్మీకి విగ్రహాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో ప్రధాని.. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.5వేల కోట్లతో నిర్మించిన టెర్మినల్-2ను ప్రారంభిస్తారు. 108 అడుగుల ఎత్తైన నాద ప్రభు కెంపెగౌడ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత తమిళనాడులోని దిండిగల్‌కు వెళ్లి అక్కడ గాంధీగ్రామ్‌ రూరల్‌ ఇనిస్టిట్యూట్‌ 36వ స్నాతకోత్సవంలో మోదీ పాల్గొంటారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×