E-Paper
Advertisement

Modi : కొత్త ఎంపీలకు అవకాశం ఇవ్వండి.. మోదీ పిలుపు

Modi : కొత్త ఎంపీలకు అవకాశం ఇవ్వండి.. మోదీ పిలుపు
Advertisement

Modi : పార్లమెంట్ లో చర్చలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని ప్రతిపక్షాలను కోరారు. సభలో కొత్త ఎంపీలకు మాట్లాడే అవకాశాలు కల్పించాలని సూచించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు.

ఈ ఏడాది ఆగస్టు 15తో స్వతంత్ర భారతావనికి 75 ఏళ్లు పూర్తయ్యాయని మోదీ అన్నారు. ఇక మనముందు ఉన్నది ఆజాదీకా అమృత్‌ కాల్‌ అని తెలిపారు. జీ-20 సదస్సుకు భారత్‌ అధ్యక్షత వహిస్తున్న వేళ.. ఈ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని వివరించారు. అంతర్జాతీయంగా భారత్ పై అంచనాలు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రపంచ వేదికలపై మన భాగస్వామ్యం పెరుగుతోందన్నారు. ఇప్పుడు జీ-20 సదస్సుకు అధ్యక్షత వహించే అవకాశం లభించిందని తెలిపారు. ఇది మన సామర్థ్యాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించేందుకు వచ్చిన అద్భుత అవకాశమని మోదీ పేర్కొన్నారు.

Advertisement

దేశ అభివృద్ధి కోసం ఈ పార్లమెంట్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నాలు జరగాలని మోదీ ఆకాంక్షించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. ఈ చర్చలు సానుకూలంగా, ఫలప్రదంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ఎంపీలు, యువ సభ్యులకు చర్చల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని అన్ని రాజకీయ పార్టీల నేతలకు సూచించారు. ప్రజాస్వామ్య దేశంలో మరో తరాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సభలో ఆటంకం కలిగితే కొత్త ఎంపీలు మాట్లాడేందుకు అవకాశం ఉండదన్నారు.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 వరకు కొనసాగుతాయి. మొత్తం 17 రోజులపాటు సమావేశాలు జరుగుతాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×