E-Paper
Advertisement

Trains : ఒడిశా ప్రమాదం ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు.. 38 దారి మల్లింపు..

Trains : ఒడిశా ప్రమాదం ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు.. 38 దారి మల్లింపు..
Advertisement

Odisha train accident news today(Latest breaking news in telugu): ఒడిశాలో ఘోర రైలు ప్రమాద ప్రభావం ఇతర రైలు సర్వీసులపై పడింది. ఈ ఘటన నేపథ్యంలో 43 రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరో 38 రైళ్లను టాటానగర్‌ స్టేషన్‌ మీదుగా మళ్లించినట్లు ప్రకటించారు. హౌరా – పూరీ సూపర్‌ఫాస్ట్‌, హౌరా -బెంగళూరు సూపర్‌ఫాస్ట్‌, హౌరా -చెన్నై మెయిల్‌, హౌరా -సికింద్రాబాద్‌, హౌరా -హైదరాబాద్‌, హౌరా -తిరుపతి, హౌరా -పూరీ సూపర్‌ఫాస్ట్‌ , హౌరా -సంబల్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ , సంత్రగాచి-పూరీ ఎక్స్‌ప్రెస్‌ తదితర రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు బెంగళూరు – గువాహటిరైలును విజయనగరం, టిట్లాగఢ్‌, జార్సుగుడా, టాటా మీదుగా దారి మళ్లించారు. ఖరగ్‌పుర్‌ డివిజన్‌లో ఉన్న చెన్నై సెంట్రల్‌-హావ్‌డా రైలును జరోలి మీదుగా, వాస్కోడగామా-షాలిమార్‌, సికింద్రాబాద్‌-షాలిమార్‌ వీక్లీ రైళ్లను కటక్‌, అంగోల్‌ మీదుగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

Advertisement

ఇక ఒడిశా ఘటనతో గోవా-ముంబై వందేభారత్‌ సర్వీస్ ప్రారంభం వాయిదా పడింది. ప్రధాని మోదీ వందే భారత్ రైలు ఇవాళ ఉదయం వర్చువల్ గా ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కొంకణ్‌ రైల్వే అధికారులు ప్రకటించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×