E-Paper
Advertisement

Mahua Moitra : టీఎంసీ నేత మహువా కేసు.. మాజీ స్నేహితుడు దెహద్రాయ్‌కు సీబీఐ సమన్లు..

Mahua Moitra : టీఎంసీ నేత మహువా కేసు.. మాజీ స్నేహితుడు దెహద్రాయ్‌కు సీబీఐ సమన్లు..
Advertisement

Mahua Moitra : లోక్‌సభలో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారంటూ తృణముల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రాపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఆమె మాజీ మిత్రుడు జై అనంత్ దెహద్రాయ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సమన్లు ఇచ్చింది. గురువారం(జనవరి 25) ఆయన్ను సీబీఐ ప్రశ్నించనుంది.

లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. మొయిత్రా పార్లమెంట్ లాగిన్‌ వివరాలను దుబాయ్‌ నుంచి యాక్సెస్‌ చేశారని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎథిక్స్‌ కమిటీ.. మహువా మొయిత్రాతో పాటు ఆమెపై ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దుబే, న్యాయవాది దెహద్రాయ్‌ను కమిటీ విచారించింది. నిబంధనలకు విరుద్ధంగా తన పార్లమెంట్‌ లాగిన్‌ వివరాలను బయటి వ్యక్తులకు ఇచ్చినట్లు కమిటీ నిర్ధారించింది. ఈ క్రమంలోనే ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ గతంలో ప్రకటించారు.

Advertisement

పశ్చిమ్‌ బెంగాల్‌కు చెందిన కొందరు పోలీసు అధికారులతో ఉన్న పరిచయాలతో మహువా తనపై అక్రమంగా నిఘా ఉంచారని డిసెంబర్‌లో దెహద్రాయ్‌ సీబీఐకి లేఖ రాశారు. తన ఫోన్‌ నెంబర్‌తో, తాను ఎక్కడున్నాననే విషయాన్ని ట్రాక్‌ చేసే అవకాశం ఉందని ఆ లేఖలో ఆయన ఆరోపించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×