E-Paper
Advertisement

Italy : ఇటలీ రాజధాని రోమ్ లో కాల్పులు.. ప్రధాని ఫ్రెండ్ మృతి..

Italy : ఇటలీ రాజధాని రోమ్ లో కాల్పులు.. ప్రధాని ఫ్రెండ్ మృతి..
Advertisement

Italy : ఇటలీ రాజధాని రోమ్‌లో జరిగిన కాల్పులు కలకలం రేపాయి. రోమ్‌లోని ఫిడెన్‌ జిల్లాలోని ఓ కేఫ్‌లో ఈ ఘటన జరిగింది. అపార్ట్‌మెంట్ రెసిడెంట్స్‌ కమిటీ సమావేశంపై చర్చించేందుకు కొందరు సభ్యులు ఓ కేఫ్‌లో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఓ దుండగుడు తుపాకీతో అక్కడికి చేరుకుని ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. అందరినీ చంపేస్తానని అరుస్తూ ఒక్కసారిగా వారిపైకి కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ఇటవీ ప్రధాని స్నేహితురాలు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు.

ఈ కాల్పుల్లో చనిపోయిన ముగ్గురూ మహిళలే. కాల్పుల తర్వాత స్థానికులు దుండగుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 50 ఏళ్ల నికొలెట్టా గొలిసానో తన స్నేహితురాలేనని ప్రధాని జార్జియా మెలోనీ ప్రకటించారు. ఆమెతో గతంలో దిగిన సెల్ఫీని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీకి చెందిన మెలోనీ దేశ తొలి మహిళా ప్రధాని. మెలోని అక్టోబర్‌లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

Advertisement

పాశ్చాత్య దేశాల్లో రోజురోజుకు గన్ కల్చర్ మితిమీరుతోంది. అమెరికాలో గతంలో జరిగిన కాల్పుల ఘటనల్లో ఎంతో మంది చనిపోయారు. ఇప్పుడు ఇటలీలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×