E-Paper
Advertisement

Delhi : ఢిల్లీలో కాల్పుల కలకలం.. ఆ మహిళే టార్గెట్..!

Delhi : ఢిల్లీలో కాల్పుల కలకలం.. ఆ మహిళే టార్గెట్..!
Advertisement

Delhi : దేశంలో గన్ కల్చర్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇటీవల యూపీలో గ్యాంగ్ స్టర్ , మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదురుడిని పోలీసుల సమక్షంలోనే ముగ్గురు యువకులు కాల్చి చంపారు. తాజాగా ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. దక్షిణ ఢిల్లీలోని సాకేత్‌ కోర్టు ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది.

లాయర్‌ దుస్తుల్లో వచ్చిన దుండగుడు ఓ మహిళను టార్గెట్ చేశాడు. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. కాల్పుల్లో మహిళ సహా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Advertisement

సాకేత్‌ కోర్టులోని లాయర్‌ ఛాంబర్‌ వద్ద కాల్పులు ఘటన జరిగింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసు విచారణ కోసం ఆ మహిళ కోర్టుకు హాజరయ్యారు. ఆమె తన న్యాయవాదితో మాట్లాడుతుండగా దుండగుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇటీవల ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఓ లాయర్‌ దారుణ హత్యకు గురయ్యారు. లాయర్ల దుస్తుల్లో వచ్చిన దుండగులు.. కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించి న్యాయవాదిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఇప్పుడు సాకేత్‌ కోర్టు ఆవరణలో కాల్పులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఈ మధ్యకాలంలో కాల్పుల ఘటనలు పెరగడంపై సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×