E-Paper
Advertisement

Rail: ఒకేరోజు రెండు రైళ్లకు మంటలు.. అనుమానాస్పదం!?

Rail: ఒకేరోజు రెండు రైళ్లకు మంటలు.. అనుమానాస్పదం!?
Advertisement
train

Rail: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌-2 బోగీలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేసి ప్రయాణికులను దింపేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని, ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

బెంగళూరు రైల్వేస్టేషన్ లో ఘోర ప్రమాదం తప్పింది. ప్లాట్ ఫామ్ పై ఆగి ఉన్న ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. B1, B2 రెండు ఏసీ కోచ్ లకు మంటలు వ్యాపించాయి. భారీగా పొగ రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను చల్లార్చారు.

Advertisement

ఇలా ఒకేరోజు రెండు వేరు వేరు చోట్ల.. ఒకే తరహా ప్రమాదాలు జరగడం కాకతాళీయమా? అనుమానాస్పదమా? అనే కోణంలో విచారిస్తున్నారు రైల్వే అధికారులు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×