E-Paper
Advertisement

Delhi liquor policy case: మనీష్ సిసోదియా జుడిషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు.. జూలై 22న తదుపరి విచారణ

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియా జుడిషియల్ కస్టడీని వారం రోజులు పొడిగిస్తూ.. ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఈ రోజు న్యాయమూర్తి ముందు మనీష్ సిసోదియా హాజరయ్యారు. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 22న జరుగుతుంది.

Delhi liquor policy case: మనీష్ సిసోదియా జుడిషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు.. జూలై 22న తదుపరి విచారణ
Advertisement

Delhi liquor policy case: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియా జుడిషియల్ కస్టడీని వారం రోజులు పొడిగిస్తూ.. ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఈ రోజు న్యాయమూర్తి ముందు మనీష్ సిసోదియా హాజరయ్యారు. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 22న జరుగుతుంది.

Also Read: జొమాటో, స్విగ్గీ ఛార్జీల మోత.. ఆర్డర్‌పై ఫీజు పెంపు

Advertisement

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోదియా, ఢిల్లీ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రితోపాటు ఎక్సైజ్ మినిస్టర్ కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో 2023 ఫిబ్రవరిలో ఆయనను సిబిఐ అరెస్టు చేసింది. ఈ కారణంగా ఆయన ఫిబ్రవరి 28, 2023న మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఆ తరువాత మార్చి 2023లో ఢిల్లీ మద్యం పాలసీ ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని అభియోగాలు మోపుతూ ఈడీ అధికారులు అరెస్టు చేశారు.

Also Read: మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక 24 గంటలు షాప్ ఓపెన్.. ఎక్కడంటే?

Advertisement

ఢిల్లీ మద్యం పాలసీ కేసు
2021-22 సంవత్సరంలో ఢిల్లీ రాష్ట్ర పరిధిలో లిక్కర్ షాపులకు లైసెన్స్ ఇచ్చేందుకు కొందరు మంత్రులు లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీని ఖండించింది. దీంతో ఈ కొత్త మద్యం పాలసీని ఢిల్లీ గవర్నర్ రద్దు చేసి.. సిబిఐ, ఈడీ అధికారులకు పిఎంఎల్ఏ చట్టం కింద విచారణ జరిపేందుకు ఆదేశాలిచ్చారు.

ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సత్యేంద్ర జైన్, మనీస్ సిసోదియా.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కె కవిత జైల్లోనే ఉన్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×