E-Paper
Advertisement

Manish Sisodia : ఢిల్లీ హైకోర్టులో సిసోడియాకు షాక్.. నో బెయిల్..

Manish Sisodia : ఢిల్లీ హైకోర్టులో సిసోడియాకు షాక్.. నో బెయిల్..
Advertisement

Manish sisodia : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు షాక్ తగిలింది. ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్‌ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి దినేశ్ కుమార్‌ శర్మ మంగళవారం తీర్పునిచ్చారు.

సిసోడియాపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని హైకోర్టు పేర్కొంది. ఆయన బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని తెలిపింది. అందువల్ల బెయిల్‌ ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక బెయిల్‌ కోసం సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయని ఆప్ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు సిసోడియాను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఆ తర్వాత జ్యుడిషియల్‌ కస్టడీ విధించడంతో సిసోడియాను తిహార్ జైలుకు తరలించారు.

ఇటీవల సిసోడియా కస్టడీని ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు జూన్‌ 1 వరకు పొడిగించింది. అయితే జైల్లో ఆయనకు కుర్చీ, టేబుల్‌, పుస్తకాలు అందించాలని ఆదేశించింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఈడీ కూడా సిసోడియాపై కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకుంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×