E-Paper
Advertisement

G20 Summit updates : ఇండియా పేరు భారత్ గా మార్పు.. G20 సమ్మిట్ ఇన్విటేషన్ లెటర్ పై దుమారం..

G20 Summit updates : ఇండియా పేరు భారత్ గా మార్పు.. G20 సమ్మిట్ ఇన్విటేషన్ లెటర్  పై దుమారం..
Advertisement
G20 Summit updates

G20 summit latest news(National news today India) :

జీ 20 డిన్నర్ ఇన్విటేషన్‌ లెటర్‌పై దుమారం చెలరేగింది. ఇన్విటేషన్‌ లెటర్‌లో ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అని ముద్రించారు. ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియాకు బదులు ప్రెసిడెంట్‌ భారత్‌ అని ఉండటంపై విపక్షాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఇండియా పేరును భారత్‌గా మార్చారంటూ కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేష్‌ ట్వీట్ చేశారు.

ఇండియాను భారత్ అని అందరు పిలవాలని 3 రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. భారత్‌ అనే పేరుకు చారిత్రక ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఇది పురాతన కాలం నుంచి వాడుకలో ఉందని చెప్పుకొచ్చారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన 3 రోజులకే ఇండియా పేరు మార్చబోతున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

మరోవైపు విపక్షాలు కూడా తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నాయి. ఇప్పటికే 3 సమావేశాలు నిర్వహించాయి. ఈసారి ఎలాగైనా మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో కూటమికి ఈ పేరు పెట్టాయి. అయితే బీజేపీ ప్రభుత్వం ఒక్కసారిగా ఏకంగా దేశం పేరు మార్చబోతుందనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. అస్సోమ్ సీఎం హిమంత బిశ్వ శర్మ గతంలోనే ఈ విషయాన్ని ప్రస్తావించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×