E-Paper
Advertisement

Air India Express: టేకాఫ్ అవ్వగానే విమానంలో మంటలు.. తప్పిన ప్రమాదం

Air India Express: టేకాఫ్ అవ్వగానే విమానంలో మంటలు.. తప్పిన ప్రమాదం
Advertisement

Air India Express: ఎయిరిండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. అబుదబీ నుంచి కాలికట్‌కు వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి అబుదబీలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

శుక్రవారం ఉదయం అబుదబీ నుంచి కాలికట్ వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ అయి 1000 అడుగుల ఎత్తులో ఉండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్నవారికి ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థంకాక భయాందోళనలకు గురయ్యారు. అయితే ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ తిరిగి విమానాన్ని అబుదబీలో ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

విమాన ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ప్రమాదం జరిగిందని ఎయిరిండియా వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారని.. వారంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. తిరిగి ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి చేర్చినట్లు వివరించింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×