E-Paper
Advertisement

Bharat Jodo Nyay Yatra : రాహుల్ గాంధీ యాత్ర.. లోగో, స్లోగన్ విడుదల..

Bharat Jodo Nyay Yatra : రాహుల్ గాంధీ యాత్ర.. లోగో, స్లోగన్ విడుదల..
Advertisement
today news paper telugu

Bharat Jodo Nyay Yatra(Today news paper telugu) :

పార్లమెంటులో సమస్యలను లేవనెత్తడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వనందుకే కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టబోతుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర లోగో, ట్యాగ్‌లైన్‌ “న్యాయ్ కా హక్ మిల్నే తక్” ను ఖర్గే విడుదల చేశారు.

భారత్ జోడో న్యాయ్ యాత్ర దేశంలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలపై దృష్టి పెడుతుందని మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. ఇండియా కూటమి నాయకులను కూడా ఈ మార్చ్‌లో పాల్గొనడానికి ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు. ఈ వేదిక ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మణిపూర్‌లో అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయన్నారు. దేశ ప్రధాని ఇప్పటి వరకు కూడా ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదని ఖర్గే విమర్శించారు.

Advertisement

ప్రతిపక్ష నేతలను బెదిరించేందుకే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలకు ఉపయోగిస్తోందని మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈ నెల 14న మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి ప్రారంభమవుతుందన్నారు. 66 రోజుల్లో 110 జిల్లాలు, 100 లోక్‌సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తుందని ఖర్గే తెలిపారు. మరోవైపు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్తారా లేదా అని విలేకరులు ప్రశ్నించగా దానిపై ఖర్గే స్పందించారు. ఆలయ ప్రతిష్టాపనకు ఆహ్వానం అందిందని వెల్లడించారు. దీనిపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని ఖర్గే చెప్పారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×