E-Paper
Advertisement

DU: ఢిల్లీ వర్సిటీని తాకిన మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ రగడ

DU: ఢిల్లీ వర్సిటీని తాకిన మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ రగడ
Advertisement

DU: ప్రధాని మోదీపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం ఖడించింది. డాక్యుమెంటరీకి సంబంధించిన లింక్స్‌ను బ్లాక్ చేసింది. తాజాగా ఈ డాక్యుమెంటరీ రగడ ఢిల్లీ యూనివర్సిటీని తాకింది. శుక్రవారం సాయంత్రం యూనివర్సిటీలో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నట్లు విపక్షాల విద్యార్థి అనుబంధ సంఘాలు పిలుపునిచ్చాయి.

దీనిపై స్పందించిన డీయూ అధికార వర్గాలు ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్యుమెంటరీని ప్రదర్శించనివ్వమని స్పష్టం చేశాయి. స్క్రీనింగ్‌ను అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు వెల్లడించాయి.

Advertisement

ఇటీవల జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ క్యాంపస్‌లో స్క్రీనింగ్‌ను అడ్డుకునేందుకు అధికారులు విద్యుత్‌, ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. అలాగే జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో డాక్యుమెంటరీని ప్రదర్శించినందుకు పోలీసులు 13 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని విడుదల చేశారు.

మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లకు సంబంధించి ‘ఇండియా ది మోదీ క్వశ్చన్’ పేరుతో బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. వెయ్యి మందికి పైగా ముస్లింలు ఈ దాడిలో చనిపోయారని.. ఈ అల్లర్లలో మోదీ పాత్రపై ఆరోపణలు వచ్చాయని డాక్యుమెంటరీలో తెలిపింది. అలాగే 2019లో ప్రధానిగా తిరిగి బాధ్యతలు చేపట్టాక మోదీ వివాదాస్పద విధానాలు తీసుకొచ్చారని, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించి 370 ఆర్టికల్‌ను రద్దు చేశారని వివరించింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×