E-Paper
Advertisement

Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ.. అద్భుత ముహూర్తం పెట్టిన ఆచార్య

Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ.. అద్భుత ముహూర్తం పెట్టిన ఆచార్య
Advertisement

Ayodhya Ram Mandir: దశాబ్ధాలుగా ఎదురు చూస్తున్న రామభక్తుల కల నిజం కాబోతోంది. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు 84 సెక్షన్ల అమృత ఘడియలు.. అద్భుత ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య అత్యంత శుభ గడియలు ఉన్నాయని వారణాసికి చెందిన సంగ్వేద విద్యాలయ ఆచార్యుడు, జ్యోతిషుడు ఆచార్య గణేశ్వర్‌ శాస్త్రి ద్రవిడ్‌ వెల్లడించారు. ఆ సమయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగితే దేశం మారు మోగిపోతుందన్న ఆయన.. మేష లగ్నంలో అభిజిత్‌ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు.

యూపీలోని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. భవ్య మందిర నిర్మాణం పూర్తి కానుండటంతో వచ్చే నెల 22 వ తేదీన.. అయోధ్య రామాలయ గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అయితే ఆరోజు మంచి ముహూర్తం ఉందని.. మధ్యాహ్న సమయంలో 84 సెకన్ల పాటు శుభ గడియలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో అదే రోజు మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.45 గంటల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుందని అయోధ్య ట్రస్ట్‌ వెల్లడించింది.

Advertisement

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుక అత్యంత అట్టహాసంగా కన్నులపండుగగా జరగనుంది. అందుకోసం ఏర్పాట్లలో మునిగింది అయోధ్య రామ మందిర ట్రస్ట్‌. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమవుతున్న ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ఎలాంటి విపత్తులు వచ్చినా ఆలయం చెక్కు చెదరకుండా.. 2 వేల 500ల ఏళ్లపాటు ఎంతటి ప్రకృతి ప్రళయమైనా తట్టుకుని నిలబడేలా డిజైన్‌ చేసినట్టు చెబుతున్నారు ఆర్కిటెక్ట్‌ అశీశ్‌ సోంపురా. ఆలయాన్ని దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా నాగర శైలిలో నిర్మిస్తున్నారని.. ముఖ్యమైన ఆలయ గర్భ గుడిని అష్టభుజి ఆకారంలో తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలో ఉంటుందన్నారు. అలాగే ప్రధాన ఆలయ సముదాయం వరకు వెళ్లే కారిడార్‌లో 35-40 వేల మంది భక్తులు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×