E-Paper
Advertisement

Assam: మైనర్లను పెళ్లాడిన వారికి జైలు శిక్ష తప్పదు.. సీఎం హెచ్చరిక

Assam: మైనర్లను పెళ్లాడిన వారికి జైలు శిక్ష తప్పదు.. సీఎం హెచ్చరిక
Advertisement

Assam: బాల్య వివాహాలను అడ్డుకునేందుకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా… ఎక్కడో ఓ దగ్గర జరుగుతూనే ఉన్నాయి. అధికారులు బాల్య వివాహాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్న వయస్సులోనే పెళ్లి కావడంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. గువాహటిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మైనర్లను పెళ్లి చేసుకున్న వారిని అతి త్వరలోనే అరెస్ట్ చేస్తామని అన్నారు. రాబోయే ఐదారు నెలల్లో ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. 14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకొని భర్తలైన వారిని ఎవరినీ వదిలిపెట్టేలి లేదని స్పష్టం చేశారు.

Advertisement

మైనర్లను వివాహం చేసుకున్న వారిపై ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. నిందితులు యావజ్జీవ కారాగార శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. మాతృత్వం పొందడానికి అనువైన వయస్సు 22 నుంచి 30 ఏళ్లు అని.. ప్రతీ దానికి తగిన వయసు ఉండేలా దేవుడు మన శరీరాలను రూపొందించాడని హిమంత బిశ్వశర్మ తెలిపారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×