E-Paper
Advertisement

Alert: త్వరపడండి.. మార్చి నెలాఖరు వరకే ఛాన్స్..

Alert: త్వరపడండి.. మార్చి నెలాఖరు వరకే ఛాన్స్..
Advertisement

Alert: వర్క్ బిజీ లేదా ఇతర కారణాల వల్ల కొన్నిముఖ్యమైన పనులను చాలా మంది మర్చిపోతుంటారు. కొన్నిసార్లు వాయిదా వేస్తుంటారు. మరికొందరు ఇంకా సమయం ఉంది కదా అని లైట్ తీసుకుంటారు. తీరా గడువు ముగిశాక అయ్యో అప్పుడే చేసి ఉండాల్సిందని అనుకుంటారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఉన్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. మరి మీరు చేశారా?.. చేయకపోతే వెంటనే చేసేయండి..

పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలని ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయినా కూడా కొందరు పట్టించుకోవడం లేదు. అయితే మార్చి 31తో దీనికి తుది గడువు ముగిసిపోనుంది. ఎవరైతే పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసుకోలేదో వారు రూ.1000 చెల్లించి ఈలోగా చేసుకోవచ్చు. లేదంటే గడువు ముగిసిన తర్వాత వాళ్ల పాన్ కార్డ్ పనిచేయదు.

Advertisement

2022-23 ఆర్థిక సంవత్సరానికిగానూ పాత ఆదాయపు పన్ను విధానం ఎంచుకునే వారు మార్చి 31లోపు పన్నుఆదా పథకాల్లో మదుపు చేయాల్సి ఉంది. ఇలా చేస్తేనే పలు సెక్షన్ల కింద పన్ను మినహాయింపు పొందేందుకు అవకాశం ఉంటుంది.

రైతులకు ఆర్థిక సాయం అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ప్రయోజనాలను పొందాలంటే రైతులందరూ తప్పనిసరిగా మార్చి 31లోగా ఈ-కేవైసీ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×