E-Paper
Advertisement

Naveen Jindal : నవీన్‌ జిందాల్‌కు బెదిరింపు లేఖ .. రూ.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్..

Naveen Jindal : నవీన్‌ జిందాల్‌కు బెదిరింపు లేఖ .. రూ.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్..
Advertisement

Naveen Jindal : పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు బెదిరింపులు రావడం ఈ మధ్య బాగా పెరిగింది. ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని ఆగంతకులు బెదిరిస్తున్నారు. మరికొందరు లేఖలు రాసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ కు ఓ వ్యక్తి బెదిరింపు లేఖ రాయడం కలకలం రేపింది. ఆ ఆగంతకుడు 50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ లేఖపై దర్యాప్తు చేపట్టారు. నవీన్ జిందాల్ కు ఈ లేఖ రాసింది ఓ ఖైదీ అని నిర్ధారించారు.

ఛత్తీస్‌గఢ్‌ లోని పాత్రపాలిలోని జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ ఫ్యాక్టరీకి గతవారం పోస్టు ద్వారా ఈ లేఖ వచ్చింది. నవీన్‌ జిందాల్‌ 48 గంటల్లోగా రూ.50 కోట్లు ఇవ్వాలని ఆ వ్యక్తి డిమాండ్ చేశాడు. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఈ బెదిరింపు లేఖపై జిందాల్‌ కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. బిలాస్‌పూర్‌ సెంట్రల్‌ జైలులోని ఓ ఖైదీ ఈ లేఖ పంపినట్లు తేల్చారు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. నిందితుడు పూర్తి వివరాలను మాత్రం పోలీసులు బయటపెట్టలేదు.

Advertisement

ఇటీవలి కాలంలో ప్రముఖులకు వరుస బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని బెదిరిస్తూ ఓ ఆగంతకుడు ఫోన్‌ చేశాడు. రూ.100 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని గడ్కరీ కార్యాలయానికి ఒకే రోజు రెండు ఫోన్‌కాల్స్‌ రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలోనూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఖైదీ అని దర్యాప్తులో తేలింది. ఓ హత్య కేసులో కర్ణాటకలోని బెళగావి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఆ ఫోన్‌ చేసినట్లు గుర్తించారు. అలాగే నవీన్ జిందాల్ కు లేఖ రాసిన వ్యక్తి కూడా ఖైదీ అనే తేలింది. ఇలాంటి ఘటనలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×