E-Paper
Advertisement

Ukraine : రష్యాతో యుద్ధం.. 500 మంది ఉక్రెయిన్ చిన్నారుల బలి..

Ukraine : రష్యాతో యుద్ధం.. 500 మంది ఉక్రెయిన్ చిన్నారుల బలి..
Advertisement

Ukraine : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేలమంది అమాయకులను పొట్టనబెట్టుకుంది. ఈ యుద్ధంతో ఉక్రెయిన్ కు చెందిన 500 మందికి పైగా చిన్నారులు బలికావడం తీవ్ర విషాదకరం. స్వయంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ ఈ విషయాలను వెల్లడించారు.

రష్యా ఆయుధాలు, వారి ద్వేషం ఉక్రెయిన్‌ చిన్నారుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయని జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చిన్నారులలు భవిష్యత్తులో కళాకారులుగా, క్రీడా ఛాంపియన్లుగా ఉక్రెయిన్‌ చరిత్ర పుటల్లో నిలిచి ఉండేవారని అన్నారు. రష్యా దాడుల వల్ల ఎంత మంది మరణించారో కచ్చితంగా చెప్పలేమన్నారు. కొన్ని ప్రాంతాలు రష్యా ఆధీనంలో ఉండటం వల్ల మరణాల లెక్కలు తేల్చలేకపోతున్నామని జెలెన్‌స్కీ వివరించారు.

Advertisement

రష్యా జరిపిన తాజా దాడుల్లో రెండేళ్ల బాలిక మరణించింది. దినిప్రో నగరంలో ఓ అపార్ట్‌మెంట్‌ భవన శిథిలాలను తొలగిస్తుండగా ఆ బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ఆ చిన్నారి భౌతికకాయాన్ని ఆమె తండ్రే వెలికితీయడం అందర్నీ కలచివేసింది. ఆ వ్యక్తి భార్య కూడా గాయాలతో బయటపడ్డారు. శనివారం రష్యా చేసిన దాడిలో ఐదుగురు చిన్నారుల సహా 22 మంది పౌరులు గాయపడ్డారని స్థానిక గవర్నర్‌ సెర్హి లిసాక్‌ ప్రకటించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×