E-Paper
Advertisement

Yogi Adityanath Biopic: యోగి ఆదిత్యనాథ్‌ బయోపిక్‌కి సెన్సార్‌ బోర్డు షాక్‌.. సర్టిఫికేషన్‌ ఇవ్వలేం.. కోర్టును ఆశ్రయించిన టీం

Yogi Adityanath Biopic: యోగి ఆదిత్యనాథ్‌ బయోపిక్‌కి సెన్సార్‌ బోర్డు షాక్‌.. సర్టిఫికేషన్‌ ఇవ్వలేం.. కోర్టును ఆశ్రయించిన టీం
Advertisement

Yogi Adityanath Biopic Issue: ఉత్తరప్రదేశ్ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్బయోపిక్చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. సినిమాను సెన్సార్బోర్డు తిరస్కరించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దీంతో మూవీ టీం ముంబై కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం అంశం బాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. కాగా యూపీ సీఎం ఆదిత్యనాధ్జీవితత కథ ఆధారంగా రూపొందిన సినిమా అజయ్‌: ది అన్టోల్డ్స్టోరీ ఆఫ్ యోగి. ఇప్పటికే షూటింగ్పూర్తి చేసుకున్న సినిమా విడుదలకు సిద్దమైంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌, నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

Advertisement

సెన్సార్ బోర్డు అభ్యంతరం

ఇందులో భాగంగా ఇటీవల సినిమాను సెంట్రల్బోర్డ్ఆఫ్ఫిల్మ్సర్టిఫికేషన్‌(Censor) బోర్డుకు పంపించిందిఅయితే చిత్రం చూసిన బోర్డు సభ్యులు బయోపిక్ని రిజెక్ట్చేశారు. సినిమాకు యూ/ సర్టిఫికేట్ఇవ్వలేమని తేల్చిచెప్పింది. దీంతో మూవీ టీం సెన్సార్బోర్డును సవాలు చేస్తూ ముంబై హైకోర్టును ఆశ్రయించింది. సర్టిఫికేషన్దరఖాస్తులను తిరస్కరించిన సెన్సార్ను తప్పుబడుతూ మూవీ టీం కోర్టులో పిటిషన్దాఖలు చేసింది. ఈ చిత్ర బృందం పిటిషన్ను స్వీకరించిన బోర్డు.. సెన్సార్ను ప్రశ్నించింది. సినిమా సర్టిఫికేషన్ఇవ్వకపోవడానికి కారణాలన వెల్లడించాలని ఆదేశించించింది.

Advertisement

ఆ నవల ఆధారంగా బయోపిక్

అయితే గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్న నవల ఆధారంగానే చిత్రాన్ని తెరకెక్కించినట్టు మూవీ టీం తమ పిటిషన్లో పేర్కొందిఇదే అంశంపై న్యాయస్థానం సెన్సార్బోర్డును ప్రశ్నించింది. పుస్తకం ప్రజా క్షేత్రంలో ఉన్నప్పుడు లేని ఇబ్బంది సినిమా విడుదలకు ఏం ఉందని అడ్డుచెప్పారని నిలదీస్తూ సినిమాకు విడుదలకు అడ్డు చెప్పడానికి గలకారణాలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు సీబీఎఫ్సీ(CBFC)ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. మరి దీనిపై సెన్సార్హైకోర్టు ఎలాంటి వివరణ ఇవ్వనుందనే ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంది. అజయ్‌: ది అన్టోల్డ్స్టోరీ ఆఫ్ యోగి పేరుతో తెరకెక్కిన బయోపిక్ని దర్శకుడు రవీంద్ర గౌతమ్తెరకెక్కించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్పాత్రలో ఆనంత్జోషి నటించగా.. ఆయన గురువు మహంత్పాత్రలో పరేష్రావల్ నటించారు.

బోర్డు వివరణకు హైకోర్టు ఆదేశం

కాగా ఆదిత్య నాథ్జీవిత కథ ఆధారంగా శంతను గుప్తా అనే రచయిత ది మాంక్హు బికమ్చీఫ్మినిస్టర్పేరుతో పుస్తకం రాశారు. ఇప్పుడు దీని ఆధారంగానే రవీంద్ర గౌతమ్సినిమాను తెరకెక్కించారు. సినిమాలో దినేష్లాల్యాదవ్‌, అజయ్మెంగి, పవర్మల్హోత్రా, రాజేష్ఖట్టర్‌, గరిమా విక్రాంత్సింగ్‌, సర్వర్అహుజా వంటి తదితర నటీనటులు ముఖ్యపాత్రలు పోషించారు. యోగి ఆదిత్యనాథ్అసలు పేరు అజ్సిగ్బిష్త్‌. పేరు ఆధారంగానే సినిమా టైటిల్ని పెట్టారు. హిందీతో పాటు తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ రిలీజ్చేయాలని మేకర్స్భారీగా ప్లాన్చేశారు. క్రమంలో మూవీ విడుదలను సెన్సార్అడ్డుకట్ట వేయడం మూవీ టీంకి షాకిచ్చింది.

Also Read: 71st National Film Awards 2025: జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన – ఉత్తమ చిత్రంగా బాలయ్య మూవీ, ఫుల్ లిస్ట్ ఇదిగో..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×