E-Paper
Advertisement

Actress : వృద్ధాశ్రమంలో చేరిన ప్రముఖ నటి… ఎవరూ సాయం చేయలేదా?

Actress : వృద్ధాశ్రమంలో చేరిన ప్రముఖ నటి… ఎవరూ సాయం చేయలేదా?
Advertisement

Actress : దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెత సినిమా ఇండస్ట్రీలో చక్కగా సరిపోతుంది. మంచి ఫేమ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటే, ఆ తర్వాత దీనస్థితికి దిగజారే దిక్కుమాలిన పరిస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం రాదు. అయితే కొంతమంది నటీనటులకు ఎంత ఫేమ్ వచ్చినా సరే రెమ్యూనరేషన్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాంటి నటీమణులు పాపులారిటీ తగ్గిన తర్వాత దారుణమైన పరిస్థితిలో జీవిస్తున్నారు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి అత్యంత దీనమైన స్థితిలో ఉన్న నటులను ఎంతోమందిని చూసాము. తాజాగా మరో నటి ఓ వృద్ధాశ్రమంలో చేరడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో సినిమా పెద్దలు ఆమెకు సహాయం చేయలేదా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇంతకీ వృద్ధాశ్రమంలో చేరిన ఆ నటి ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే…

వృద్ధాశ్రమంలో పాకీజా 

పాకీజా అనే పేరు 90 కిడ్స్ బాగా తెలుసు. గతంలో తెలుగు సినిమాల్లో కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన ఈవిడ ఒరిజినల్ పేరు వాసుకి. అయితే ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాలోని పాకీజా క్యారెక్టర్ తో బాగా ఫేమస్ కావడంతో సొంత పేరు కంటే ఆ క్యారెక్టర్ పేరుతోనే ఆమె తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు. ఇక ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో లేడీ కమెడియన్ గా నటించిన ఈవిడ ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నట్టు సమాచారం. చెరదీసి చూసే  వాళ్ళు లేక తాజాగా ఆవిడ ఒక వృద్ధాశ్రమంలో చేరడం సంచలనంగా మారింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలోని ఒక వృద్ధాశ్రమంలో వాసుకి చేరారు. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించిన తాను… ఇండస్ట్రీకి దూరమైన తర్వాత పూట గడవని స్థితిని చేరుకున్నాను అని చెప్పిన వీడియో తెగ వైరల్ అయింది. ఈ వీడియోని చూసి ఆమె దుర్భర జీవితం గురించి తెలుసుకున్న శ్రీరామ వృద్ధాశ్రమం నిర్వాహకుడు జల్లి కేశవరావు ఆమెకు ఆశ్రయం కల్పించినట్టు తెలుస్తోంది.

మరి సినీ పెద్దలేం చేశారు?

Advertisement

వాసుకికి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా సహాయం అందినట్టు తెలుస్తోంది. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన గురువు మోహన్ బాబు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు ఆవిడ. మంచు విష్ణు తన పరిస్థితిని తెలుసుకొని, కళ్ళకు ఆపరేషన్ చేయించడానికి సాయం అందించారని అన్నారు వాసుకి. అంతేకాదు మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు కలిసి రూ, 400000 ఆర్థిక సాయం అందించారని వాసుకి అలియాస్ పాకీజా వెల్లడించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కూడా తనకు సహాయం చేసినట్టు ఆమె తెలిపారు.

1991లో ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది వాసుకి. ఆ తర్వాత పెదరాయుడు, రౌడీ గారి పెళ్ళాం, మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నాదేశం వంటి సినిమాలలో కనిపించారు. ఇక ఇటీవలే నటి పావలా శ్యామలా ఇలాంటి దీనస్థితి కారణంగా ఆత్మహత్య చేసుకోబోగా, ఆమెను ఓ వృద్ధాశ్రమంలో చేర్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో నటీ వృద్ధాశ్రమంలో చేరడంపై తెలుగు ఆడియన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Read Also : అనుకున్న దానికంటే ముందుగానే ‘దేఖ్ లేంగే’ సాంగ్ రిలీజ్… కానీ క్రేజీ ట్విస్ట్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×