E-Paper
Advertisement

బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో అరుదైన దృశ్యం.. మోదీని కలిసి మురిసిపోయిన తనికెళ్ల భరణి!

బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో అరుదైన దృశ్యం.. మోదీని కలిసి మురిసిపోయిన తనికెళ్ల భరణి!
Advertisement

Bharani Modi : తనికెళ్ల భరణి..పరిచయం అక్కర్లేని పేరు.రచయితగా, నటుడిగా ఏంతో గుర్తింపు తెచ్చుకున్న భరణి అన్నింటికి మించి శివ భక్తుడు కూడా.అలాంటి భరణి తాజాగా పెట్టిన ఒక పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతుంది.విషయంలోకి వెళ్తే మే 10, 2026 ఆదివారం రోజున ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సంగతి తెల్సిందే.ఈ సందర్భంగా భరణి మోడీ ని బేగంపేట విమానాశ్రయంలో కలిశారు.ఈ క్రమంలో భరణి ఎమోషనల్ అవుతూ,మోడీని మెచ్చుకుంటూ పెట్టిన పోస్ట్ ఇపుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.

ఏకంగా మోదీని పురాణ పురుషులతో పోలుస్తూ

Advertisement

“నేను రాముణ్ణి చూడలేదు.. కృష్ణుణ్ణి చూడలేదు.. ఆదిశంకరుల్ని చూడలేదు.. వివేకానందుణ్ణి చూడలేదు.. కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను.. నా జన్మ ధన్యమైంది” అంటూ భరణి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఫొటో షేర్ చేశారు.మాములుగా సెలబ్రిటీలు పోలిటీషియన్స్ ని కలవడం,కలిసామంటూ పోస్టులు పెట్టడం మనం చూస్తూనే ఉంటాం.కానీ ఈ పోస్ట్ లో భరణి ఏకంగా మోదీని పురాణ పురుషులతో పోలుస్తూ, ఆయన చేతిని ముద్దాడటం తన అదృష్టంగా భావించానని చెప్పడం విశేషం.ఇదే కాదు గతంలో కూడా భారతీయ సంస్కృతికి, హిందూ ధర్మానికి మోదీ ఇస్తున్న ప్రాధాన్యతపై భరణి అనేకసార్లు ప్రశంసలు కురిపించారు కూడా.ముఖ్యంగా కాశీ విశ్వనాథుని కారిడార్ నిర్మాణం వంటి ఆధ్యాత్మిక పనుల పట్ల ఆయనకు ప్రత్యేక గౌరవం ఉందన్న సంగతి తెల్సిందే.

Advertisement

also read :“నా వైఫ్ మిస్సింగ్”అంటున్న వరుణ్ సందేశ్ ..క్లాప్ కొట్టిన సి. కళ్యాణ్!

ఆయనో మల్టీ టాలెంటెడ్

ఇక తనికెళ్ల భరణి కెరీర్ విషయానికి వస్తే ఆయన కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఆయనో మల్టీ టాలెంటెడ్ . 1980s లో రైటర్ గా కెరీర్ మొదలెట్టిన భరణి లేడీస్ టైలర్’, ‘శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్’, ‘మనీ వంటి ఎన్నో మంచి మంచి సినిమాలని తన కలం బలంతో మరో మెట్టు ఎక్కించారు.ముఖ్యంగా 1989లో వచ్చిన రామ్ గోపాల్ వర్మ ‘శివ’ సినిమాకు భరణి అందించిన డైలాగ్స్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయ్.ఇక రచయితగానే కాకుండా దాదాపు 750కి పైగా సినిమాలలో నటించి మెప్పించారు .అలా ‘యమలీల’,’సముద్రం’,’నువ్వు నేను’,’మన్మథుడు’ వంటి సినిమాల్లో చేసిన పాత్రలకి నంది అవార్డులను అందుకున్నారు కూడా.

ఇది కాస్త ఓవర్ గా లేదూ అంటూ

ముఖ్యంగా ‘మిథునం’ అంటూ 2012లో భరణి దర్శకత్వం వహించిన సినిమా తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. కేవలం ఇద్దరు పాత్రలతో (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి) ఒక మంచి సినిమాని వెండితెరపై ఆవిష్కరించి విమర్శకుల ప్రశంసలు పొందారు. కేవలం సినిమాకే పరిమితం కాకుండా ‘నక్షత్ర దర్శనం’, ‘ఎందరో మహానుభావులు’ వంటి పుస్తకాలతో పాటు ‘శబాష్ రా శంకర’ అంటూ ఆయన రాసిన భక్తి పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాము.అయితే భరణి తన పోస్ట్ లో మోడీ పై ఉన్న అభిమానాన్ని వ్యక్తపరచడాన్ని కొందరు సమర్దిస్తుంటే, మరి కొందరు మాత్రం ఇది కాస్త ఓవర్ గా లేదూ అంటూ ట్రోల్ చేయడం గమనార్హం.

also read :అప్పుడు ‘ఆదిపురుష్’.. ఇప్పుడు ‘కల్కి 2’.. అదే తప్పు మళ్ళీ జరుగుతుందా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×