E-Paper
Advertisement

Lokesh Kanagaraj AA23పై సోషల్ మీడియా దుమారం.. ఇంత రిస్ట్ అవసరమా..!

Lokesh Kanagaraj AA23పై సోషల్ మీడియా దుమారం.. ఇంత రిస్ట్ అవసరమా..!
Advertisement

Lokesh Kanagaraj AA23: ఇటీవల సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న ప్రాజెక్ట్ AA23. ఈ సినిమా అధికారికంగా ప్రకటించిన వెంటనే పెద్ద చర్చ మొదలైంది. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.

 

Advertisement

లోకేష్ కనగరాజ్‌కు గత కొంతకాలంగా వరుసగా అనుకున్న స్థాయి విజయాలు రాలేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా కూలీ సినిమా తర్వాత ఆయన కెరీర్ ప్లానింగ్ మొత్తం మారిపోయిందని అంటున్నారు. కూలీకి ముందు ఆయన కైతి 2 సినిమా మొదలుపెట్టాలని అనుకున్నారు. దీనిపై హీరో కార్తీ కూడా సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. కానీ కూలీ ఫలితం తర్వాత కొన్ని కారణాల వల్ల కైతి 2 ప్రాజెక్ట్ ఆగిపోయింది.

 

Advertisement

దీని తర్వాత లోకేష్ బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్తో ఒక సూపర్ హీరో సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమీర్ ఖాన్ కూడా పలు ఇంటర్వ్యూలలో ధృవీకరించారు. కానీ కూలీ ఫలితం తర్వాత ఈ ప్రాజెక్ట్ కూడా డ్రాప్ అయ్యింది. అనంతరం రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించే సినిమాకు లోకేష్ దర్శకత్వం వహిస్తాడనే ప్రచారం జరిగింది. అది కూడా చివరికి ఆయన చేతిలోంచి జారిపోయింది.

 

లోకేష్ కి ముప్ప తిప్పలు..

 

ఇలాంటి వరుస ఎదురుదెబ్బల తర్వాత లోకేష్‌కు AA23 దక్కింది. అయితే ఇదే ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. కొంతమంది అభిమానులు “లోకేష్ ముందుగా కైతి 2 చేయాల్సింది” అని అంటున్నారు. మరికొందరు “AA23కి ఉన్న హైప్ మొత్తం అల్లు అర్జున్ వల్లే” అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దర్శకుడిగా లోకేష్ మళ్లీ తన సత్తా నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వారు భావిస్తున్నారు.

 

లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్..

 

ఇంకా..AA23 లోకేష్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన “ఇరుంబు కై మాయావి” అయి ఉండొచ్చనే బలమైన ప్రచారం జరుగుతోంది. ఈ కథను ఆయన మొదటగా సూర్యను దృష్టిలో పెట్టుకొని రాశానని గతంలో చెప్పాడు. ఇప్పుడు అదే కథను ఎక్కువ పారితోషికం కోసం తెలుగులో చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. AA23కి లోకేష్‌కు సుమారు 75 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారనే వార్తలు కూడా విమర్శలకు కారణమయ్యాయి.

 

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. షూటింగ్ ఈ ఏడాది మధ్యలో ప్రారంభం కానుందని సమాచారం. ఇంత విమర్శల నడుమ AA23 లోకేష్ కనగరాజ్‌కు భారీ కంబ్యాక్ అవుతుందా? లేక పెద్ద తప్పిదమా? అన్నది కాలమే తేల్చాలి.

 

Also Read: Allu Arjun: జపాన్ లో అడుగుపెట్టిన పుష్పరాజ్..ఇక రప్పా రప్పానే!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×