E-Paper
Advertisement

UBS Pawan Kalyan: డబ్బింగ్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్.. 20 నిమిషాల్లోనే ఓటీటీ డీల్!

UBS Pawan Kalyan: డబ్బింగ్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్.. 20 నిమిషాల్లోనే ఓటీటీ డీల్!
Advertisement

UBS Pawan Kalyan: దాదాపు 14 ఏళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్(Harish Shankar) కాంబినేషన్ మళ్లీ తెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. 2012లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కాంబోలో మళ్లీ సినిమా రాబోతుండడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా, శ్రీ లీల (Sree Leela) రాశిఖన్నా (Raashii khanna) హీరోయిన్లుగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ . మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ , చేకూరి మోహన్ నిర్మించిన ఈ చిత్రం మొదట మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ.. విడుదల తేదీని ప్రీ పోన్డ్ చేస్తూ మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

డబ్బింగ్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్..

ఇకపోతే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ఒకవైపు అంచనాలు పెరుగుతుంటే మరొకవైపు అంత బిజీ షెడ్యూల్లో కూడా తన పాత్రకు డబ్బింగ్ మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్. నేటి నుంచి ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. ఇకపోతే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా పవన్ కళ్యాణ్ తన సినిమా కి డేట్స్ కేటాయిస్తూ అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా అటు థియేటర్లలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.

20 నిమిషాల్లోనే ఓటీటీ డీల్..

Advertisement

ఇదిలా ఉండగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలలో వేగంగా పాల్గొంటున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ నేపథ్యంలోనే ఓటీటీ డీల్ గురించి కామెంట్లు చేశారు. సినిమా షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే ఓటీటీ డీల్ కుదిరినట్లు ఆయన తెలిపారు.. హరీష్ శంకర్ మాట్లాడుతూ..” నా వ్యక్తిగత పరిశీలన కోసం కొన్ని కీలకమైన సన్నివేశాలను ఎడిట్ చేసి ఒక చిన్న వీడియో సిద్ధం చేసుకున్నాను.. ఆ విజువల్స్ చూసిన నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు సినిమాపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ క్లిప్స్ లోని కంటెంట్ , మేకింగ్ స్టైల్ నచ్చడంతో 20 నిమిషాల్లోనే డీల్ కి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు” అంటూ హరీష్ శంకర్ తెలిపారు ఇకపోతే 80 కోట్లకు ఈ సినిమా ఓటీటీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.

ఓవర్సీస్ బుకింగ్స్ ప్రారంభం..

ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. మరొకవైపు ఈ సినిమా బుకింగ్స్ కూడా ఓవర్సీస్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.

Advertisement

also read:Dhurandhar 2 Trailer: ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్.. అంతకుమించి!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×